రాగిణి, సంజనా.. అన్ని ఆస్తులు ఎక్కడివి?
మాదకద్రవ్యాల కేసు తిరగరాని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టైన సినీతారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ విచారణ సందర్భంగా చెబుతున్న అంశాలు.. కొత్తపేర్లను తెరపైకి తెస్తునాయి. ...
బెంగళూరు (యశ్వంతపుర) : మాదకద్రవ్యాల కేసు తిరగరాని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టైన సినీతారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ విచారణ సందర్భంగా చెబుతున్న అంశాలు.. కొత్తపేర్లను తెరపైకి తెస్తునాయి. ఈ వ్యవహారాలతో మరికొందరు సినీ నటులు, సంగీతకళాకారులకు సంబంధాలున్నాయని ఆ ఇద్దరూ గుట్టు రట్టు చేసినట్లు సమాచారం బయటకు పొక్కింది. ఇద్దరు ప్రముఖ నటీమణులూ ఆ జాబితాలో ఉన్నారనేది మరో సమాచారం. పలువురు రాజకీయ నాయకులు, వారి కుమారులు, శ్రీమంతుల బిడ్డల పేర్లు.. ఇలా జాబితా పెరుగుతోంది. వాస్తవం ఎంతో తెలియని నేపథ్యంలో వదంతులు షికారు చేస్తున్నాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆ ప్రముఖులంతా ముందస్తు జామీను కోసం ప్రయత్నాల్లో పడ్డారు. సినీ నటులు, సంగీత కళాకారులు ముందస్తు జామీను కోసం తమ న్యాయవాదుల్ని సంప్రదిస్తున్నారు. నటీమణులు చెప్పిన పేర్లన్నీ ప్రముఖులవేనని, వారికి కేసులో సంబంధం ఉన్నదీ- లేనిదీ తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
♦ నటీమణులు మత్తుపదార్థాలు తీసుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని శాస్త్రీయంగా గుర్తించడానికి ఆ ఇద్దరి నుంచి రక్తం, తలవెంట్రుకలను సేకరించిన వైద్యులు మడివాళలోని ప్రయోగశాలకు పంపించారు. కనీసం 92 రోజుల కిందట డ్రగ్స్ వాడినా ఈ పరీక్షల్లో తేలిపోతుందట. ఈ పరీక్షలకు సంజనా, రాగిణి ససేమిరా అన్నారు. వైద్య సిబ్బందితో తీవ్రస్థాయిలో గొడవపడ్డారని సమాచారం.
♦ మరోవైపు.. ఆ ఇద్దరి ఆస్తులపై సీసీబీ అధికారులు దృష్టి సారించారు. నాకు నగరంలో పది ప్లాట్స్ ఉన్నట్లు సంజనా చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారట. తక్కువ సినిమాల్లో నటించి అంత ఆస్తి ఎలా సంపాదించారో తెలియని అంశం. మాదక ద్రవ్యాల సరఫరా ద్వారా వచ్చిన నగదు హవాలా రూపంలో తరలించారన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
♦ రాగిణి, సంజనా గల్రానీలను శుక్రవారం సీసీబీ సంయుక్త కమిషనర్ సందీప్ పాటిల్ ప్రత్యేకంగా విచారించారు. మందు పార్టీలు, శ్రీలంక పర్యటనలు, మత్తుపదార్థాల వాడకంపై ఆయన ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు సంధించారు. కొన్ని ప్రశ్నలకు ఆ ఇద్దరూ బదులివ్వలేదని సీసీబీ వర్గాలు వెల్లడించాయి. ‘మాకేం తెలీదు. అనవసరంగా ఇరికించారు’ అంటూ వాపోతున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఇదే కేసులో కీలక నిందితుడు, మంగళూరుకు చెందిన ప్రతీక్శెట్టిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు షేక్ ఫైజల్, ఆదిత్య ఆళ్వ ఆచూకీ తెలియలేదు.
సంబరగిపైనా కేసు
మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాలతో సంబంధం ఉందని ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన న్యాయవాది ప్రశాంత్ సంబరగి విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చినట్లు పోలీస్ శాఖ సంయుక్త కమిషనర్ సందీప్పాటిల్ తెలిపారు. సీసీబీ అధికారుల ఎదుట శనివారం హాజరు కావాలని నోటీసు జారీ చేశారు. మరోవైపు చామరాజపేట శాసనసభ్యుడు జమీర్ అహ్మద్ఖాన్ ఫిర్యాదు ఆధారంగా చామరాజపేట పోలీసులు సంబరగిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. జమీర్ పరువు నష్టం దావా వేయడమేగాక.. సంబరగి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. |
కస్టడీలోనే రాగిణి బెంగళూరు (శివాజీనగర) : మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలకు సంబంధించి అరెస్టయిన నటీమణి రాగిణి ద్వివేది జామీను కోసం దాఖలు చేసిన విచారణను ఏసీఎంఎం న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. జామీను కోసం ముంబయికి చెందిన న్యాయవాదులను రాగిణి తల్లిదండ్రులు నియమించారు. గతంలో ఒకసారి దాఖలుచేసిన అర్జీని 33వ సీసీిహెచ్ న్యాయస్థానం తోసిపుచ్చింది. ♦ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన కథానాయికలు రాగిణి, సంజనలను వీడియో కాన్ఫరెన్సు ద్వారా వసంతనగర సమీపంలోని ప్రత్యేక న్యాయస్థానం ముందు పోలీసులు హాజరు పరిచారు. ఇప్పటి వరకు నిర్వహించిన విచారణకు వీరిద్దరూ సహకరించలేదని, మరో వారం పాటు వారిద్దరినీ తమ కస్టడీకి అప్పగించాలని దర్యాప్తు అధికారులు కోరారు. వారికీ- మాదక ద్రవ్యాలకూ సంబంధం ఉందని పలు ఆధారాలు ఇప్పటికే స్వాధీనపరుచుకున్నామని, వాటి గురించి అడిగిన ప్రశ్రలకూ వారు బదులివ్వడం లేదని పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సోమవారం వరకు వారిద్దరినీ సీసీబీ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాగిణి కస్టడీ శుక్రవారం సాయంత్రానికి ముగియగా, సంజన కస్టడీ శనివారం సాయంత్రానికి ముగియనుంది. రెండో శనివారం న్యాయస్థానాలకు సెలవు ఉన్న నేపథ్యంలో ఆమెనూ న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ♦ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన ప్రశాంత్ రాంకా, లూమ్, రవిశంకర్, రాగిణి, రాహుల్, నియాజ్ల పోలీసు కస్టడీని సోమవారం వరకు ఒకటో ఏసీఎంఎం న్యాయస్థానం పొడిగించింది. నిందితులను వీడియో కాన్ఫరెన్సు విధానంలో న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వీరెవరూ జామీను కోసం ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేదు. విచారణ కొనసాగించవలసిన నేపథ్యంలో కస్టడీని పొడిగించాలని పోలీసుల తరుఫు న్యాయవాది విన్నపాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు