రౌడీబేబీ..‘గల్లీరౌడీ’గా మారాడు!

సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధానపాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముందు ఈ మూవీకి ‘రౌడీ బేబి’గా టైటిల్‌ పెట్టారు. కానీ, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ టైటిల్‌ను మార్చి ‘గల్లీ రౌడీ’గా ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా

Published : 25 Mar 2021 14:50 IST

హైదరాబాద్‌: సందీప్‌ కిషన్, బాబీసింహా ప్రధానపాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముందు ఈ మూవీకి ‘రౌడీ బేబి’గా టైటిల్‌ పెట్టారు. కానీ, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ టైటిల్‌ను మార్చి ‘గల్లీ రౌడీ’గా ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా టైటిల్‌ వీడియోను టాలీవుడ్‌ దర్శకులు పూరీ జగన్నాథ్‌, హరీశ్‌శంకర్‌, బాబీ, గోపీచంద్‌ మలినేని, శివ నిర్వాణ విడుదల చేశారు. టైటిల్‌ మాత్రమే మారిందని చిత్రంలోని ఫన్‌, ఎంటర్‌టైన్‌మెంట్ ఏ మాత్రం తగ్గవని అంటున్నారు. కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌,  ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని