santosh shoban: ‘మంచి రోజులు వచ్చాయి’?

సంతోష్‌ శోభన్,  మెహరీన్‌ జంటగా దర్శకుడు మారుతి తన బృందంతో కలిసి ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది

Published : 15 Jun 2021 09:44 IST

హైదరాబాద్‌: సంతోష్‌ శోభన్,  మెహరీన్‌ జంటగా దర్శకుడు మారుతి తన బృందంతో కలిసి ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. దీని కోసం ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది.

కొవిడ్‌ సమయంలో రెండు ఇళ్ల మధ్య జరిగే కథ ఇది. కరోనా వెళ్లిపోవడంతో సినిమా సుఖాంతమవుతుందని సమాచారం. అందుకే దీనికి తగ్గట్లుగానే ‘మంచి రోజులు వచ్చాయి’ అనే పేరు ఎంచుకున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. 30రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ సినిమాని పట్టాలెక్కించారు. జులై తొలి వారం చిత్రం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. మారుతి ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా ‘పక్కా కమర్షియల్‌’ అనే చిత్రం సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని