Sarkaru Vaari Paata: మహేశ్‌ అభిమానులూ ఇక రెడీగా ఉండండి..!

తమ హీరో సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్‌డేట్‌ వస్తుందా? అని ఎదురుచూస్తున్న మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త.

Updated : 12 Apr 2022 17:00 IST

హైదరాబాద్‌: తమ హీరో సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్‌డేట్‌ వస్తుందా? అని ఎదురుచూస్తున్న మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త. ఇక మీరు సంబరాలు సిద్ధమవడమే ఆలస్యం. వరుస పెట్టి ఆసక్తికర అప్‌డేట్‌లను ఇవ్వబోతున్నట్లు ‘సర్కారువారి పాట’చిత్ర బృందం తెలిపింది. మహేశ్‌ కథానాయకుడిగా పరుశురామ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తయింది. కేవలం ఒకే ఒక పాటను షూట్‌ చేయాల్సి ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, పోస్టర్స్‌తో పాటు, ‘కళావతి’సాంగ్‌కు విశేష క్రేజ్‌ వచ్చింది. ఇక వరుస అప్‌డేట్‌లు ఇవ్వనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. వేసవి కానుకగా మే12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని