Sarkaru Vaari Paata: ‘సర్కారువారి పాట’ టికెట్‌ ధరల పెంపు.. తెలంగాణలో ఎంతంటే?

మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌, కామెడీ చిత్రం ‘సర్కారువారి పాట’ (Sarkaru Vaari Paata). కీర్తి సురేశ్‌ (keerthy suresh) కథానాయిక.

Published : 09 May 2022 16:29 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌, కామెడీ చిత్రం ‘సర్కారువారి పాట’ (Sarkaru Vaari Paata). కీర్తి సురేశ్‌ (keerthy suresh) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలంగాణలో టికెట్‌ ధరలు పెంచుకోవడంతోపాటు అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్‌లు, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ. 50, ఎయిర్‌ కండిషన్‌ సాధారణ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 12 నుంచి 7 రోజులపాటు అమల్లో ఉండనున్నాయి.

భారీ బడ్జెట్‌ చిత్రాల విడుదల సమయంలో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుతాలు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ ప్రాజెక్టుకు తమన్‌ సంగీత దర్శకుడు. సముద్ర ఖని, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని