Sarkaru Vaari Paata: ‘సర్కారువారి పాట’ అద్దె చెల్లించకుండా చూడొచ్చు!

మహేశ్‌బాబు(Mahesh babu) అభిమానులకు శుభవార్త. ఆయన కథానాయకుడిగా పరశురామ్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

Updated : 15 Jun 2022 13:57 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు(Mahesh babu) అభిమానులకు శుభవార్త. ఆయన కథానాయకుడిగా పరశురామ్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata). కీర్తిసురేశ్‌ కథానాయిక. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. రూ.199 చెల్లించి సినిమాను చూడొచ్చు. కాగా, జూన్‌ 23వ తేదీ నుంచి ఆ అద్దె కూడా చెల్లించకుండా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లు ఉచితంగా ఈ సినిమాను చూడొచ్చు. ఈ విషయాన్ని ప్రైమ్‌ వీడియో తాజాగా ప్రకటించింది. గత కొంతకాలంగా కొత్త సినిమాలను అమెజాన్‌ ప్రైమ్‌ తొలుత అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచుతోంది. ఆ తర్వాత సబ్‌స్క్రైబర్లు ఉచితంగా చూసే వెసులుబాటును కల్పిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని