Sarkaru Vaari Paata: 7న ‘సర్కారు..’ వేడుక

మహేష్‌ బాబు కథానాయకుడిగా పరశురామ్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారు వారి పాట’. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కీర్తి

Updated : 06 May 2022 13:59 IST

మహేష్‌ బాబు కథానాయకుడిగా పరశురామ్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారు వారి పాట’. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 7న హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ప్రీరిలీజ్‌ వేడుకలో భాగంగా పలు సర్‌ప్రైజ్‌లు అందించనున్నట్లు తెలిపారు. దీనికి ప్రస్తుతం ట్విటర్‌లో ప్రత్యేక ఎమోజీ వచ్చింది. దీన్ని చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఓ ప్రాంతీయ సినిమా ఇలా ప్రత్యేక ఎమోజీని కలిగి ఉండటం ఇదే తొలిసారని చిత్ర వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని