Sarkaru Vaari Paata: మహేశ్‌ అభిమానులకు ‘సర్కారు వారి..’ మరో సర్‌ప్రైజ్‌

ఎప్పుడెప్పుడా అని మహేశ్‌బాబు అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సర్కారు వారి పాట’ గురువారం విడుదలై, సందడి చేస్తోంది.

Published : 14 May 2022 02:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడెప్పుడా అని మహేశ్‌బాబు అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సర్కారు వారి పాట’ గురువారం విడుదలై, సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇప్పటికే ఓ కామెడీ సీన్‌ ప్రోమోను పంచుకోగా తాజాగా ‘టైటిల్‌ ర్యాప్’ పాటను విడుదల చేసింది. ‘చూడు చూడు దొర వేట మొదలు.. వాడిపోయే వీరి కట్టుకథలు’ అంటూ ప్రారంభమయ్యే ఈ ర్యాప్‌ను మహా రచించారు. శ్రావణ భార్గవి, మహా ఆలపించారు. ఈ చిత్రానికి తమన్‌ ఏ స్థాయిలో సంగీతం అందించారో తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఈఎంఐల నేపథ్యంలో సాగే ఈ కథను పరశురామ్‌ తెరకెక్కించారు. మహేశ్‌తోపాటు కథానాయిక కీర్తి సురేశ్‌ను చాలా కొత్తగా చూపించారంటూ అభిమానులు పరశురామ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని