Sarkaru Vaari Paata: ‘సర్కారువారి పాట’విడుదలయ్యే ఓటీటీ వేదిక ఇదే!

మహేశ్‌బాబు(Mahesh babu) కథానాయకుడిగా నటించిన ‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata) విడుదలై కామెడీ,

Published : 12 May 2022 18:36 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు(Mahesh babu) కథానాయకుడిగా నటించిన ‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata) విడుదలై కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అభిమానులను అలరిస్తోంది. మహేశ్‌బాబు నటన, ప్రథమార్ధంలో కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు బలాన్ని తెచ్చాయి. సినిమా విడుదలయ్యే వరకూ ‘సర్కారువారి పాట’ ఏ ఓటీటీలో వస్తుందో ఎవరికీ తెలియలేదు. ఈ సినిమా హక్కును ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ‘కేజీయఫ్‌2’ ఓటీటీ రైట్స్‌ దక్కించుకోగా, ఇప్పుడు ‘సర్కారువారి పాట’ కూడా అమెజాన్‌ లైబ్రరీలో చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని