Sarkaru VaariPaata: సర్కారు వారి పాట.. ఎఫ్‌3 విడుదల తేదీలు ఖరారు

మహేశ్‌బాబు కథానాయకుడిగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారువారి పాట’.

Published : 31 Jan 2022 20:30 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారువారి పాట’. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన కరోనా కారణంగా ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పుడు ‘ఆర్ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల విడుదల తేదీలు ప్రకటించడంతో ‘సర్కారు వారిపాట’ చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘సర్కారు వారి పాట’ నుంచి ప్రేమగీతాన్ని విడుదల చేయనున్నారు.

ఈ వేసవిలో నవ్వుల జల్లులతో తడిపేందుకు తామూ సిద్ధం అంటున్నారు వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వారిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్‌3’. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని