తగిన జాగ్రత్తలతో..సెట్‌లోకి ‘సర్కారు..’ ‌

మహేశ్‌ బాబు కథానాయకుడిగా పరశురామ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్‌ నాయిక. తాజాగా ఈ సినిమా గురించి  ఓ అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం.

Published : 13 Apr 2021 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ బాబు కథానాయకుడిగా పరశురామ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్‌ నాయిక. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. కొవిడ్‌ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని మహేశ్‌ మంగళవారం సెట్‌లో అడుగుపెడుతున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. ఈ సినిమా ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణలో ఉంది. 

బ్యాంకు స్కాం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మహేశ్ ప్రీ లుక్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 2022 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని