Sarkaru vaari paata: తమాషాలొద్దు.. బోర్డు తీసెయ్‌: ప్రభాస్‌ శ్రీను

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన లేటస్ట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్‌ వ్యవస్థ.. అందులోని లోటుపాట్లను, ఈఎంఐల వల్ల సామాన్య ప్రజలు...

Published : 13 May 2022 11:33 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన లేటస్ట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్‌ వ్యవస్థ.. అందులోని లోటుపాట్లను, ఈఎంఐల వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తూ రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. మహేశ్‌ నటన, ఫైట్‌ సీక్వెన్స్‌లు, కామెడీ, లవ్‌ ట్రాక్స్‌ బాగున్నాయంటూ సినీ ప్రియులు ప్రశంసిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మహేశ్‌ నుంచి ఇలాంటి మాస్‌, కమర్షియల్‌ హంగులున్న సినిమా రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘సర్కారువారి పాట’కు వస్తోన్న రెస్పాన్స్‌పై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ స్పందించింది. ఫస్ట్‌డే కలెక్షన్స్‌లో ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసిందని పేర్కొంటూ ఈ సినిమా నుంచి ఓ కామెడీ ప్రొమోని షేర్‌ చేసింది.

తనికెళ్ల భరణి కుటుంబం తీసుకున్న డబ్బుని రికవరీ చేసేందుకు వచ్చిన ఏజెంట్‌గా ప్రభాస్‌ శ్రీను కనిపించారు. తనికెళ్ల భరణికి సపోర్ట్‌గా నిలిచిన మహేశ్‌.. ‘‘ఈ ఇంట్లోకి  బ్యాంకు వారికి కానీ రికవరీ ఏజెంట్లకు కానీ ప్రవేశం లేదు’’ అంటూ గేటు ముందు ఓ బోర్డు పెట్టడం, అది చూసిన ప్రభాస్‌ శ్రీను..  ‘‘ఆ బోర్డుకు అర్థమేంటి? తమాషాలు చేస్తున్నావా ఏంటి? బోర్డు తీయ్‌’’ అంటూ మహేశ్‌తో వాగ్వాదానికి దిగడాన్ని ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రోమో నవ్వులు పూయించేలా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని