పవర్‌స్టార్ రిలీజ్‌ చేసిన ‘శశి’ ట్రైలర్‌!

ఆది సాయికుమార్‌, సురభి జంటగా నటించిన ‘శశి’ట్రైలర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తాజాగా విడుదల చేశారు. ‘మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతలను గెలవాలి’అంటూ హీరో ఆది చెప్తున్న డైలాగ్స్‌ స్ఫూర్తివంతంగా ఉన్నాయి. ట్రైలర్‌

Updated : 11 Mar 2021 17:37 IST

]

హైదరాబాద్‌: ఆది సాయికుమార్‌, సురభి జంటగా నటించిన ‘శశి’ ట్రైలర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తాజాగా విడుదల చేశారు. ‘మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతలను గెలవాలి’ అంటూ ఆది చెప్తున్న డైలాగ్స్‌ స్ఫూర్తివంతంగా ఉన్నాయి. అలాగే ‘ప్రేమంటే లేనిచోట వెతుక్కోవడం కాదు, ఉన్నచోట నిలబెట్టుకోవడం’అని హీరోయిన్‌ చెప్తున్న డైలాగ్‌తో ఇద్దరి మధ్య ఎడబాటు కనిపిస్తోంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రంలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ఎంతటి సూపర్‌హిట్‌ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. శ్రీహనుమాన్‌ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించగా శ్రీనివాస్‌ నాయుడు నడికంట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అరుణ్‌ చిలవేరు మ్యూజిక్‌ అందించారు. మార్చి 19న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. అప్పటిదాకా ఈ ట్రైలర్‌ను చూసేయండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని