Sonusood అభిమానులకు విన్నపం
పాలాభిషేకాల పేరుతో పాలు వృథా చేయవద్దని సోనూసూద్ తన అభిమానులను కోరారు. అవసరమైన వారికి ఆ పాలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కర్నూల్, చిత్తూరు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అభిమానులు సోనూసూద్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పాలాభిషేకాల పేరుతో పాలు వృథా చేయవద్దని సోనూసూద్ తన అభిమానులను కోరారు. అవసరమైన వారికి ఆ పాలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అభిమానులు సోనూసూద్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు ట్విటర్లో పోస్టు చేశారు. అవి కాస్తా.. సోనూసూద్కు చేరాయి. వాటిపై స్పందించిన సోనూ.. ‘‘మీ అభిమానానికి కృతజ్ఞుడను. పాలు వృథా చేయొద్దని మీ అందరినీ కోరుతున్నా. అవసరం ఉన్న వారి కోసం దాచిపెట్టండి’’ అంటూ సోనూసూద్ ఆ ట్వీట్ను రీట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సోనూసూద్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, ఆత్మకూర్, నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆయన చిత్రపటాలకు అభిమానులు క్షీరాభిషేకాలు చేశారు. కాగా.. ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సోనూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆక్సిజన్ అవసరం ఉన్న రాష్ట్రాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈమేరకు ఆయన కర్నూలు, ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రుల ఫొటోలను ట్విటర్లో పంచుకున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి సోనూసూద్ ఎంతోమందికి సాయం చేస్తూ వస్తున్నారు. సోనూసూద్ వల్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా లబ్ధిపొందారు. సోనూ చేసిన సాయానికి కృతజ్ఞతగా కొంతమంది ఏకంగా గుడికట్టి పూజలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత
ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వడ చెన్నై, కాఖా కాఖా, వేట్టైయాడు విళయాడు తదితర చిత్రాల్లో నటించారు. -
‘టిల్లు 3’ని త్వరలోనే ప్రకటిస్తాం
‘‘ప్రేక్షకులు టిల్లు పాత్ర అనగానే హాస్యాన్నే ఆశిస్తారు. అందుకే హాస్యం ప్రధానంగానే స్క్రిప్ట్ రాశా. -
ప్రతినిధి పిలుపు
‘‘ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఒళ్లు విరిచి బయటకొచ్చి ఓటేయండి...’’ అంటూ ఓటర్లకు పిలుపునిచ్చాడు బాధ్యత కలిగిన ఓ జర్నలిస్ట్. -
బాక్సింగ్ శిక్షణలో మీనాక్షి
తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అగ్ర తారలతో జోడీ కడుతూ జోరు చూపిస్తోంది మీనాక్షి చౌదరి. -
ఎందరికో అది ఓ కల.. వాళ్లలో నేనూ ఉన్నా
దక్షిణాదితోపాటు.. బాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ తన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది కథానాయిక రాశీ ఖన్నా. -
అలియా స్పై ప్రపంచంలోకి బాబీ దేవోల్?
పాత్ర ఏదైనా అలవోకగా నటించగల సత్తా ఉన్న నటి అలియా భట్. -
‘విష్వక్..’ పేర్లు వినిపించాడు
విష్వక్ సేన్ కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. -
ట్రాఫిక్లో చిక్కుకొని పాట పాడాను
‘నేను ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు ‘అమర్ సింగ్ చమ్కీలా’ చిత్రం కోసం సింగింగ్ ఆడిషన్ ఇవ్వాల్సి వచ్చింది’ అని అంటోంది పరిణీతి చోప్రా. -
రూహ్ బాబా మ్యాజిక్కే వేరు!
‘యానిమల్’ చిత్రంతో సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ భామ త్రిప్తి దిమ్రి. -
మనందరి కథతో... ‘శ్రీరంగనీతులు’
మూడు కథలు... నలుగురి జీవితాలు...ఎవరి ప్రయాణం ఎలా సాగింది? ఏ కథ ఎలాంటి మలుపు తీసుకుందో తెలియాలంటే ‘శ్రీరంగనీతులు’ చూడాల్సిందే. -
‘జీ2’ సెట్స్లోకి బనితా సంధు
అడివి శేష్ కథానాయకుడిగా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘జీ2’. ‘ -
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
15 ఏళ్ల క్రితం అలా వెళ్లాం.. ఇప్పుడు గర్వంగా ఉందంటూ అల్లు శిరీష్ పోస్ట్
15 ఏళ్ల క్రితం టూరిస్ట్లుగా వెళ్లినచోటే అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఉండడం ఎంతో ఆనందంగా ఉందని అల్లు శిరీష్ పేర్కొన్నారు.