Cinema News: చిత్ర సీమలో ఆ పరిస్థితి మారింది: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

రణధీర్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’. నందినిరెడ్డి నాయిక. ఎమ్‌.వినయ్‌బాబు దర్శకుడు. బీసు చందర్‌గౌడ నిర్మాత. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ టీజర్‌ని ఆవిష్కరించారు.

Updated : 24 Jun 2022 08:56 IST

రణధీర్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’. నందినిరెడ్డి నాయిక. ఎమ్‌.వినయ్‌బాబు దర్శకుడు. బీసు చందర్‌గౌడ నిర్మాత. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ టీజర్‌ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమలో ఇదివరకు ఆ నలుగురే నిర్మాతలు, వాళ్లే హీరోలు, వాళ్లవే థియేటర్లు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది, ఇంకా మారాలి. కొత్తవాళ్లు వస్తున్నారు. విజయాలు అందుకుంటున్నారు’’ అన్నారు. అసభ్యతకి తావు లేకుండా ఈ సినిమాని తెరకెక్కించామ’’న్నారు దర్శకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని