గోపీచంద్‌ ‘సీటీమార్‌’ విడుదల వాయిదా

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత మరో సినిమా విడుదల వాయిదా పడింది. గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌నంది దర్శకత్వంలో ‘సీటీమార్‌’ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమన్నా కథానాయికగా సందడి చేయనుంది

Published : 27 Mar 2021 23:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత మరో సినిమా విడుదల వాయిదా పడింది. గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌నంది దర్శకత్వంలో స్పోర్ట్స్‌ డ్రామాగా ‘సీటీమార్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమన్నా కథానాయికగా సందడి చేయనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఇటీవల రానా నటించిన ‘అరణ్య’ చిత్రం హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ మార్చి 26న విడుదల కావల్సి ఉండగా.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సినిమా విడుదల చేయలేదు. తాజాగా సీటీమార్‌ సైతం వాయిదా పడింది. అయితే.. నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తికాకపోవడంతోనే సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఈ సినిమాలో గోపీచంద్‌, తమన్నా ఇద్దరూ కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ ప్రేక్షకులను అలరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని