Arjun: ఇది వృత్తిపట్ల నిబద్ధత లేకపోవడమే
విష్వక్ సేన్తో తాను సినిమా చేయడం లేదని ప్రకటించారు నటుడు, దర్శక నిర్మాత అర్జున్. అతను వృత్తిపట్ల నిబద్ధత లేకుండా వ్యవహరించడం వల్లే తానీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
విష్వక్తో సినిమా చేయడం లేదు
నటుడు, దర్శక నిర్మాత అర్జున్
విష్వక్ సేన్తో (Vishwak Sen) తాను సినిమా చేయడం లేదని ప్రకటించారు నటుడు, దర్శక నిర్మాత అర్జున్ (Arjun). అతను వృత్తిపట్ల నిబద్ధత లేకుండా వ్యవహరించడం వల్లే తానీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన దర్శకత్వంలో ఇటీవల విష్వక్ సేన్, ఐశ్వర్య సర్జా జంటగా ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈనెల 3న చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో నిలిపి వేయాల్సి వచ్చిందని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కథానాయకుడు విష్వక్ కారణమని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు అర్జున్. ‘‘నా 42ఏళ్ల సినీ కెరీర్లో ఇలా ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడలేదు. కానీ, విష్వక్ చేసిన పనికి బాధ కలిగి నా ఆవేదనను పంచుకుంటున్నా. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభం కావాల్సిన మా సినిమా అతని వల్లే ఆలస్యమైంది. ఈనెల 3న కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు ఆయన సరే అనడంతో.. రాత్రింబవళ్లూ కష్టపడి సెట్ సిద్ధం చేశాం. కానీ, ఆరోజు ఉదయం 4గంటలకు విష్వక్ నుంచి చిత్రీకరణ రద్దు చేయమనే సందేశం వచ్చింది. అది చూసే సరికి నాకేం అర్థం కాలేదు. వృతిపట్ల ఇంత నిబద్ధత లేకుండా ఉంటారా? ఒక నిర్మాత, దర్శకుడు అంటే అతనికి మర్యాద లేదా? ఇండస్ట్రీలో బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి.. ఇలా ఎంతో నిబద్ధత కలిగిన నటుల్ని చూశా. ఈతరం హీరో అల్లు అర్జున్తోనూ కలిసి పనిచేశా. షూటింగ్ అంటే సమయానికి వచ్చేస్తారు. కానీ, ఈ నటుడు మాత్రం ‘రేపు చిత్రీకరణ నిలిపేయండి’ అని సందేశాలు పెడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనితో నేను సినిమా చేయాలనుకోవడం లేదు. హీరోగా అతను కొన్ని సూచనలు చెయ్యొచ్చు తప్పులేదు. కానీ, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, చంద్రబోస్ పాటలు, అనూప్ రూబెన్స్ సంగీతం.. ఇలా పలు విషయాలకు వంక పెట్టాడు. అతనికి చాలాసార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఇలాంటివి అందరికీ తెలియాలి. బయటకు మాట్లాడలేని నిర్మాతలుంటారు. నాకు ధైర్యం, శక్తి ఉన్నాయి. అందుకే ఇలా చెబుతున్నా. పరిశ్రమలో పద్ధతులు తెలియకపోతే సినిమాలు చేయకండి. ఈ విషయంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మాట్లాడతా. మరొకరికి ఇలా జరగకుండా చూడమని మాత్రమే చెబుతా. దీన్ని వివాదం చేయాలనుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు అర్జున్. ఈ సినిమాని త్వరలో మరో నటుడితో మళ్లీ మొదలు పెడతానని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో