Padma Shri: నటనలో ‘షావుకారు’ సాయంలో ‘చిలకమ్మా మజాకా’
సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న నటులు ఎంతోమందే. తొలిసారి అలా ఓ సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోవడం ‘షావుకారు’ జానకితోనే మొదలైంది. 400కి పైగా చిత్రాల్లో కథా నాయికగా, క్యారెక్టర్ నటిగా గుర్తుండిపోయే పాత్రల్లో ఒదిగిపోయిన ఆమె ఇప్పుడు పద్మశ్రీ షావుకారు జానకి. రేడియో, నాట్య కళాకారిణిగా, నటిగా కళారంగానికి చేసిన సేవలకిగానూ తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆమె పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు.
పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన కేంద్రం
సాయంలో ‘చిలకమ్మా మజాకా’ పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన కేంద్రం సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న నటులు ఎంతోమందే. తొలిసారి అలా ఓ సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోవడం ‘షావుకారు’ జానకితోనే మొదలైంది. 400కి పైగా చిత్రాల్లో కథా నాయికగా, క్యారెక్టర్ నటిగా గుర్తుండిపోయే పాత్రల్లో ఒదిగిపోయిన ఆమె ఇప్పుడు పద్మశ్రీ షావుకారు జానకి. రేడియో, నాట్య కళాకారిణిగా, నటిగా కళారంగానికి చేసిన సేవలకిగానూ తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆమె పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు.
తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె ‘షావుకారు’ జానకిగా ఎన్నటికీ చెరిగిపోని స్థానాన్ని సంపాదించారు. తమిళ ప్రేక్షకులకు సౌకార్గా సుపరిచితం అయ్యారు. జానకి వయసు 90 ఏళ్లు. అందులో నట జీవితమే 70 ఏళ్లుపైనే. వెండితెర చూసిన ఎన్నో మలుపులకి ఆమె సాక్ష్యం. ఎన్నో తరాలకి ఆమె స్ఫూర్తి. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్ వంటి అగ్ర కథానాయకులతో కలిసి తొలి అడుగులు వేసిన ఘనత ఆమెది. ‘చిలకమ్మా... మజాకా’ అంటూ ఆమె చెప్పిన డైలాగులను 1987-90ల మధ్యకాలంలోని సినీ ప్రియులెవరూ మరచిపోలేరు. ‘సంసారం ఒక చదరంగం’ సినిమాలోలాగే ముక్కుసూటిగా మాట్లాడడం... పదిమందికి సాయంగా నిలవడం జానకి నైజం అని పరిశ్రమ వర్గాలు చెబుతుంటాయి.
మలి అవకాశంతో...
షావుకారు జానకి అసలు పేరు టేకుమళ్ల జానకి. 1931 డిసెంబర్ 12న కాకినాడ సమీపంలోని పెద్దాపురంలో సచీదేవి, టేకుమళ్ల వెంకోజీరావు దంపతులకి జన్మించారు. కథానాయిక కృష్ణకుమారి జానకికి స్వయానా చెల్లెలు. తండ్రి ఉద్యోగం రీత్యా వీళ్ల బాల్యమంతా బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో గడిచింది. ఆ తర్వాత తండ్రి ఆంధ్రా పేపర్ మిల్స్లో పని చేయడం కోసం రాజమహేంద్రవరం చేరుకోవడంతో అక్కడే అక్కాచెల్లెళ్లు వేదాంతం జగన్నాథశర్మ దగ్గర కూచిపూడి నాట్యశాస్త్రాన్ని అభ్యసించారు. వీరి కుటుంబం మద్రాసుకి మకాం మారాకా నాట్యరంగంలో కొనసాగారు. జానకి రేడియో నాటకాల్లో వేషాలు వేస్తుండేవారు. ఆ సమయంలోనే దర్శకుడు బి.ఎన్.రెడ్డి దృష్టిలో పడ్డారు. తాను తీయాలనుకున్న ‘స్వర్గసీమ’ కోసం ఆమెని కథానాయికగా ఎంపిక చేయాలనుకున్నారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఆమె ఆగిపోయారు. పదిహేనో ఏటే ఆమెకి పెళ్లి చేశారు. చిన్న వయసులోనే బిడ్డకి తల్లయిన జానకి భర్తతో కలిసి అస్సాం వెళ్లారు. ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాసి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైన ఆమె భర్తతో కలిసి మళ్లీ మద్రాసు చేరుకున్నారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు బి.ఎన్.రెడ్డిని కలిశారు. కానీ అప్పటికే ఆయన ‘స్వర్గసీమ’ చిత్రాన్ని పూర్తి చేశారు. ఆయన సూచనతోనే నాగిరెడ్డి - చక్రపాణిని కలిసిన జానకి వారు తీయాలనుకున్న ‘షావుకారు’లో కథానాయికగా అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో కథానాయకుడిగా నటించిన ఎన్టీఆర్కి అది రెండో సినిమానే. సున్నం రంగడి పాత్ర పోషించిన ఎస్వీ రంగారావుకూ అది రెండో చిత్రమే. పదిహేడేళ్ల వయసులో కథానాయిక సుబ్బులు పాత్రలో ‘షావుకారు’లో నటించారు జానకి. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం తర్వాత జానకి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె చేసిన తొలి చిత్రమే ఇంటి పేరు కావడం విశేషం.
అన్నీ మంచి శకునములే...
తెలుగు ప్రేక్షకులకే కాదు, తమిళ ప్రేక్షకులకూ అభిమాన నటి అయ్యారు జానకి. ‘సవతిపోరు’, ‘పిచ్చి పుల్లయ్య’, ‘వద్దంటే డబ్బు’, ‘రోజులు మారాయి’, ‘రైతు బిడ్డ’... ఇలా తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా అవకాశాలు సొంతం చేసుకున్నారు. 1955లో ఆమె పలు భాషల్లో ఏకంగా 11 సినిమాల్లో నటించి బిజీ కథానాయికగా మారారు. ‘చెరపకురా చెడేవు’, ‘కన్యాశుల్కం’, ‘సొంత వూరు’, ‘చరణదాసి’, ‘ఏది నిజం’, జయం మనదే’, ‘భాగ్యరేఖ’, ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి మరింతగా చేరువయ్యారు.
* 1960 - 62 మధ్య కాలంలో తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేశారు. ఆ తర్వాత సహాయ పాత్రల్లోనే ఎక్కువగా మెరిశారు. 1981లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘తిళ్లు ముళ్ళు’ సినిమాలో మీనాక్షి అనే ఓ కామెడీ పాత్రలో జానకి అలరించారు. తమిళంలోనే ‘తంబి’ అనే చిత్రంలోనూ మెరిశారు. ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘బెజవాడ బెబ్బులి’, ‘సంసారం ఒక చదరంగం’, ‘గీతాంజలి’తోపాటు, వెంకటేష్ నటించిన ‘బాబు బంగారం’లోనూ ఆమె సందడి చేశారు.
* ఓపిక ఉన్నంతకాలం నటిస్తూనే ఉంటానని చెప్పే జానకి నట ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలోనూ రాజేంద్రప్రసాద్కి అత్తగా నటిస్తున్నారు. ఆ చిత్రం విడుదల కావల్సి ఉంది. ‘సంసారం ఒక చదరంగం’, ‘అమూల్యం’ సినిమాల్లో నటనకిగానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు అందుకున్నారు. జానకి భర్త పేరు శంకరమంచి శ్రీనివాసరావు. ఆమెకి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. మనవరాలు వైష్ణవి తెలుగు, తమిళ సినిమాల్లో నటిగా రాణించారు. నిండు నూరేళ్లు ఆమె అదే ఉత్సాహంతో నటించాలని పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
మధుర గీతాల గని.. సోనూ
‘రావే నా చెలియా...రావే నా చెలియా’ అంటూ ‘జీన్స్’ చిత్రం లో హుషారు రేకెత్తించిన గాత్రం ఆయనది. ‘నిండు నూరేళ్ల సావాసం...’ అంటూ స్వచ్ఛమైన ప్రేమ గీతానికి ‘ప్రాణం’ పోసిన మధుర కంఠం ఆయనది. ఇలా తెలుగులో పలు పాటలకు తన గాత్రంతో జీవం పోసిన గొప్ప గాయకుడు సోనూ నిగమ్. ఆయన తెలుగులో పాడింది తక్కువ పాటలే అయినా శ్రోతల్ని బాగా అలరించారు. 2021 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారం ఆయన్ను వరించిన సందర్భంగా ప్రత్యేక కథనం.
హిందీ చిత్రసీమ సగర్వంగా చెప్పుకొనే గొప్ప గాయకుల్లో సోనూ నిగమ్ ఒకరు. కన్నడ, మలయాళ, తమిళ, బెంగాలీ, భోజ్పురి, తుళు ఇలా దేశంలోని పలు భాషలతో పాటు నేపాలీలోనూ గీతాల్ని ఆలపించి గొప్ప గాయకుడిగా నిలిచారు. పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడంతో పాటు వివిధ భాషల్లో పాటల ఆల్బమ్లు రూపొందించారు. హిందూ, ఇస్లామిక్ సంస్కృతులకు సంబంధించిన పలు ఆధ్యాత్మిక ఆల్బమ్లతో పాటు బుద్ధిజానికి సంబంధించిన ఆల్బమ్లను కూడా ఆయన రూపొందించారు. ఇప్పటివరకూ ఆయన 5000పైగానే పాటలు పాడారు. సోనూ పలు చిత్రాల్లో నటించి అలరించడమే కాదు పాటలకు సంబంధించిన రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆయన దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయంగానూ గుర్తింపు సాధించారు.
‘మోడ్రన్ రఫి’: నాలుగేళ్ల వయసులోనే తండ్రి ఆగమ్ కుమార్ నిగమ్తో కలిసి పెళ్లిళ్లు, పార్టీల్లో కూని రాగాలు తీసేవారు సోనూ. 19 ఏళ్ల వయసులో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఆయన అనతి కాలంలోనే గొప్పస్థాయికి ఎదిగారు. ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీని స్ఫూర్తిగా చెప్పే సోనూ ఆయనలానే మెలోడీలకు ప్రాణం పోస్తారు. ఆయన్ని ‘మోడ్రన్ రఫి’, ‘ది లార్డ్ ఆఫ్ ఛార్డ్స్’, ‘ది మాస్టర్ ఆఫ్ మెలోడీ’ ఇలా ఎన్నో రకాలుగా సంగీత ప్రియులు పిలుచుకుంటారు.
పురస్కారాలు: తన తియ్యటి గొంతులో వేల పాటల్ని పలికించిన సోనూని జాతీయ, అంతర్జాతీయంగా పలు పురస్కారాలు వరించాయి. ‘కహో నా హో’ చిత్రంలోని పాటకు గానూ 2003లో జాతీయ పురస్కారం అందుకున్నారు. నాలుగుసార్లు ‘ఐఫా’ అవార్డుల్ని గెలుచుకున్నారు. ‘జల్’ చిత్రంలో ఆయన స్వరపరిచిన సౌండ్ట్రాక్కిగానూ ఆస్కార్ నామినేషన్ని దక్కింది. ఆయన చుట్టూ కొన్ని వివాదాలు ఉన్నా... ప్రస్తుతం పద్మశ్రీ పురస్కారం లభించడంతో చిత్ర పరిశ్రమలోని పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Ranveer Singh: ‘శక్తిమాన్’గా రణ్వీర్.. రీల్ ‘శక్తిమాన్’ అసహనం
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) ‘శక్తిమాన్’ పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తోన్న వార్తలపై ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేశ్ ఖన్నా స్పందించారు. -
Aadujeevitham: ఆ సినిమాతో 16 ఏళ్ల అనుబంధం ఉంది: పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ చిత్రంతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు. -
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్తో ప్రగ్యా.. బ్రదర్కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Mangli: నేను క్షేమంగానే ఉన్నా.. రూమర్స్ నమ్మకండి: సింగర్ మంగ్లీ
తాను క్షేమంగానే ఉన్నానని సింగర్ మంగ్లీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. -
Mrunal Thakur: రెండేళ్లు విరామం లేకుండా వర్క్ చేశా: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ రెండేళ్లు విరామం తీసుకోకుండా సినిమాలు చేశానని తెలిపారు. -
Prithiveeraj: పృథ్వీరాజ్తో పెళ్లి జరగలేదు.. మేమిద్దరం విడిపోయాం: శీతల్ పోస్ట్
నటుడు పృథ్వీరాజ్తో తనకు పెళ్లి జరగలేదని శీతల్ తెలిపింది. ఈమేరకు ఆమె ఓ పోస్ట్ పెట్టింది. -
Aadujeevitham: ఏఆర్. రెహమాన్కు కృతజ్ఞతలు తెలిపిన మోహన్లాల్
అగ్ర కథానాయకుడు మోహన్లాల్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు కృతజ్ఞతలు తెలిపారు. -
Harika Narayan: ప్రియుడిని పెళ్లాడిన గాయని హారికా నారాయణ్
యువ గాయని హారికా నారాయణ్ పెళ్లి వేడుకగా జరిగింది. -
Elvish Yadav: పాము విషం ఏర్పాటు చేశా.. కీలక విషయాలు వెల్లడించిన బిగ్బాస్ ఓటీటీ విజేత..!
పాము విషంతో రేవ్పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టై రిమాండ్లో ఉన్నారు యూట్యూబర్, బిగ్బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్. విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. -
Tharun Bhascker: ‘కీడాకోలా’లో ఎస్పీ బాలు పాట.. లీగల్ నోటీసులపై తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే!
‘కీడా కోలా’ (Keedaa Cola)లో ఎస్పీ బాలు పాటను రీక్రియేట్ చేయడంతో నెలకొన్న వివాదంపై చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్పందించారు. -
Meetha Raghunath: వివాహబంధంలోకి అడుగుపెట్టిన ‘గుడ్నైట్’ స్టార్
రకుల్ ప్రీత్ సింగ్, నటాషా దోషి, కృతికర్భందా వంటి కథానాయికలు ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో యువ నటి చేరింది. -
upcoming movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో థ్రిల్లింగ్ కంటెంట్
గత వారం బాక్సాఫీస్ వద్ద పదికి పైగా చిన్న చిత్రాలు సందడి చేయగా, ఈ వారం కూడా అదే పంథా కొనసాగనుంది. థియేటర్లో మరికొన్ని చిన్న సినిమాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, సిరీస్లు సందడి చేయబోతున్నాయి. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్సింగ్’ టీజర్ రెడీ అవుతోందా?
‘ఉస్తాద్ భగత్సింగ్’ ప్రచార హంగామాకి తెర లేచింది. త్వరలోనే టీజర్ విడుదల చేయనున్నట్టు సమాచారం. రాజకీయ సంభాషణలతో ఆ టీజర్ ముస్తాబవుతోందని, ప్రస్తుత రాజకీయ వాతావరణానికి తగ్గట్టుగా అది ఉంటుందని తెలుస్తోంది. -
Ileana: అతడు నాకొక వరం
‘నన్ను నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి.. కష్టాల్లో తోడుండే నేస్తం.. నాకు దొరకడం అదృష్టం’ అంటోంది ఇలియానా. ఇదంతా తన భర్త మైఖేల్ డోలన్ గురించే. -
Sara Ali Khan: అమ్మే నా ధైర్యం
భిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తక్కువ కాలంలోనే తనకంటూ మంచి క్రేజ్ను సంపాదించుకుంది బాలీవుడ్ నాయిక సారా అలీఖాన్. -
Lambasingi: కలలు నెరవేర్చిన ‘లంబసింగి’
‘‘ప్రతిభ ఉన్నా అవకాశాలు రాక ఇబ్బందులు పడేవాళ్లు చిత్రసీమలో చాలామందే. సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు దర్శకత్వం చేయడం కోసం నేనూ ఏడేళ్లు ఎదురు చూశా. -
Karthikeya 3: ‘కార్తికేయ 3’కి రంగం సిద్ధం
సరికొత్త సాహసంతో త్వరలోనే ‘కార్తికేయ 3’ తెరకెక్కనుందనే సంకేతాలిచ్చారు కథానాయకుడు నిఖిల్. ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
Nithiin: ‘ఇష్క్’ కలయిక మరోసారి
వరస ఫ్లాప్లతో ఇబ్బందిపడిన కథానాయకుడు నితిన్ మళ్లీ విజయాల బాట పట్టింది ‘ఇష్క్’ సినిమాతోనే. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించింది. -
Vishal: విశాల్ కొత్త ప్రయాణం
ఇప్పటిదాకా నటనతో అలరించిన సీనియర్ నటుడు విశాల్.. దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. గతంలో ఆయన నటించిన ‘డిటెక్టివ్’ మంచి విజయాన్ని అందుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
BRS: ప్రవీణ్కుమార్ను భారాస ప్రధాన కార్యదర్శిగా నియమిస్తాం: కేసీఆర్
-
Yadagirigutta: యాదగిరిగుట్టలో వైభవంగా తిరు కల్యాణ మహోత్సవం
-
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
-
PM CARES Fund: పీఎం కేర్స్ నిధులపై పారదర్శకత ఎక్కడ?: కాంగ్రెస్
-
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు