Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్ రాజు
వీఎఫ్ఎక్స్ నేర్చుకునేందుకే ‘శాకుంతలం’ ప్రాజెక్టులో భాగమయ్యానని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆ సినిమా 3డీ ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: సమంత (Samantha) ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ (Guna Sekhar) తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). దేవ్ మోహన్, మోహన్ బాబు, గౌతమి, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం 3డీ వెర్షన్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో గుణ శేఖర్, నిర్మాతలు దిల్ రాజు, నీలిమ గుణ, రచయిత సాయి మాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు.
దిల్రాజు మాట్లాడుతూ.. ‘‘ఇంతింతై వటుడింతై అన్నట్టుగా తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైంది. సమంత మేనేజరు ఓ రోజు నా దగ్గరకు వచ్చి ‘దర్శకుడు గుణ శేఖర్.. సమంతతో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. మీరు కథ వినండి’ అని అనగానే.. సరేనన్నాను. గుణ శేఖర్కి ఏదో విధంగా సాయం చేసేందుకే నేనీ సినిమాలో భాగం అయ్యానని చాలామంది అనుకున్నారు. కానీ, నేను స్వార్థంతో వారితో చేయి కలిపా. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్కు చేరుకుంది. వీఎఫ్ఎక్స్ గురించి నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టులో చేరా. సాధారణంగా ఇలాంటి సినిమాల విషయంలో నిర్మాతలకు పెద్దగా పని ఉండదు. అలా అని నేను ఖాళీగా ఉండలేదు. ‘బాహుబలి’తో తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అలా మరిన్ని తెలుగు సినిమాలను ప్రపంచానికి చూపించాలనే ఆలోచనతో నేను వేసిన తొలి అడుగు ఈ ‘శాకుంతలం’. బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామా విజువల్ వండర్గా ఈ సినిమా రూపొందింది. మన తర్వాతి తరానికి ఈ కథ తెలియాలి. సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు అల్లు అర్హ రూపంలో ఓ సర్ప్రైజ్ ఉంటుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 19 నిమిషాలు’’ అని దిల్ రాజు తెలిపారు.
కొన్ని మార్పులంతే: గుణ శేఖర్
‘‘మహాభారతంలోని దుష్యంతుడు, శకుంతల కథను ఆధారంగా చేసుకుని కాళిదాసు.. అభిజ్ఞాన శాకుంతలం నాటకం రాశారు. దాన్ని విజువల్గా మీ ముందుకు తీసుకొచ్చే క్రమంలో కొన్ని మార్పులు చేశాం. 90 శాతం ఒరిజినల్ స్టోరీనే తెరకెక్కించాం. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. వారిని ఇంప్రెస్ చేయడమే నా ముందున్న సవాలు. సమంత.. శకుంతల పాత్రకు ప్రాణం పోశారు. దిల్ రాజుగారు నిత్య విద్యార్థి. ప్రతి రోజూ ఆయన కొత్త విషయాలను నేర్చుకుంటుంటారు. తెలుగు సినిమా వెగిలిపోతుందంటే దిల్రాజులాంటి నిర్మాతలే కారణం. ఆయన సినిమాని నిలబెట్టేందుకు చాలా కష్టపడతారు. నేనీ చిత్రాన్ని సమంతతో చేయబోతున్నానని తెలియగానే భాగస్వామ్యం కోసం చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపారు. దిల్ రాజు ఈ ప్రాజెక్టులో ఓ భాగంకావడంతో నేను సర్ప్రైజ్ అయ్యా. ఆయన కథ విని సినిమా ఎలా ఉంటుందో చెప్పేయగలరు. ఆయనలాంటి మేకర్ను ఉపయోగించుకోకపోతే మూర్ఖత్వమే అవుతుంది. ఆయన ఆడియన్స్ పల్స్ తెలిసిన నిర్మాత’’ అని గుణ శేఖర్ అన్నారు.
‘‘శాకుంతలం’ సినిమాని 3డీ వెర్షన్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన దిల్ రాజుగారిదే. ఈ ట్రైలర్ చూశాక ఆయన విజన్ అర్థమైంది. సమంత ఈ వేడుకకు రావాల్సి ఉంది. కానీ, సాధ్యపడలేదు. ఆమె మనసంతా ఇక్కడే ఉంది’’ అని నీలిమ గుణ పేర్కొన్నారు. ఈ సినిమాకి పని చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన సాయి మాధవ్ బుర్రా.. ఈ సినిమా ప్రేక్షకుల ఊహకు మించి ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
మోహన్లాల్ డ్యాన్స్ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్పై మోహన్లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. చైనీస్, జపనీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. -
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
‘రత్నం’ (Rathnam) రిలీజ్లో భాగంగా తాజాగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో నటుడు విశాల్ (Vishal) పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనని ఉద్దేశించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. -
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడీగా..?
గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు