Shah Rukh Khan: క్యాన్సర్‌తో పోరాడుతోన్న అభిమాని.. 40 నిమిషాలు వీడియో కాల్‌ మాట్లాడిన షారుక్‌

అభిమానుల పట్ల తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టారు నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan). అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న తన వీరాభిమానితో తాజాగా ఆయన ఫోన్‌ కాల్‌ మాట్లాడారు.

Updated : 24 May 2023 17:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమని ఆరాధించే అభిమానులు ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే.. వారితో మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చేందుకు సినీ తారలు ముందుంటారు. ఇలా, ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్‌, దక్షిణాది తారలు అభిమానుల పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) తన మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాటం చేస్తోన్న తన అభిమానికి ఫోన్‌ చేసి ఆమెకు ధైర్యాన్ని ఇచ్చారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చారు.

కోల్‌కతాకు చెందిన 60ఏళ్ల శివానీ చక్రవర్తికి షారుక్‌ అంటే అమితమైన ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా ఆయన్ని కలవాలని, తన చేతి వంట రుచి చూపించాలని ఆమె ఎంతో ఆశపడింది. ఇదిలా ఉండగా, శివానీ.. గత కొన్నేళ్ల క్రితం క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆమెకు క్యాన్సర్‌ చివరి దశలో ఉందని.. కొన్ని నెలల్లో చనిపోవచ్చని వైద్యులు తెలిపారు. దీంతో శివానీ ఆకాంక్ష తెలుసుకున్న ఆమె కుమార్తె ప్రియ ఇటీవల సోషల్‌మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశారు. దీనిని చూసిన షారుక్‌ తాజాగా శివానీకి వీడియో కాల్‌ చేశారు. సుమారు 40 నిమిషాలపాటు ఆమెతో మాట్లాడారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు. అంతేకాకుండా, వీలు చూసుకుని ఇంటికి వస్తానని, ఆమె చేతి వంట రుచి చూస్తానని మాటిచ్చారు. షారుక్‌ ఫోన్‌ కాల్‌తో శివానీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని