నిర్మాతగా మారనున్న షాహిద్‌

షాహిద్‌కపూర్‌ చేతినిండా సినిమాలున్నాయి. ‘జెర్సీ’ చిత్రీకరణనూ పూర్తి చేశాడు. కొన్ని భారీ చిత్రాలు పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మధ్యే రాజ్, డీకే దర్శకత్వంలో అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఓ వెబ్‌సిరీస్‌లో...

Published : 30 Apr 2021 09:43 IST

ముంబయి: షాహిద్‌కపూర్‌ చేతినిండా సినిమాలున్నాయి. ‘జెర్సీ’ చిత్రీకరణనూ పూర్తి చేశాడు. కొన్ని భారీ చిత్రాలు పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మధ్యే రాజ్, డీకే దర్శకత్వంలో అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఓ వెబ్‌సిరీస్‌లో నటించడానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఇప్పుడు మరోసారి డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈసారి నిర్మాతగా మారనున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌ ఓ భారీ ట్రయాలజీని నిర్మించబోతుంది. దీని కోసం షాహిద్‌కు సుమారు రూ.70- 80 కోట్లు ఇవ్వబోతున్నారట. అమిత్‌ త్రిపాఠి నవల ఆధారంగా ఇది తెరకెక్కనుందని తెలుస్తోంది. జానపద నేపథ్య కథతో రానున్న ఈ ప్రాజెక్టులో షాహిద్‌ భాగం కావాలనుకుంటున్నాడట. గతంలోనే డింకీ సింగ్‌ బయోపిక్‌తో నిర్మాతగా మారాలనుకున్నాడు షాహిద్‌. కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఈ ట్రయాలజీలో నిర్మాణ భాగస్వామి కాబోతున్నాడట షాహిద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని