Yash: సెన్సేషనల్‌ డైరెక్టర్‌ దర్శకత్వంలో యశ్‌ తర్వాతి చిత్రం?

‘కేజీయఫ్‌ 1, 2’ చిత్రాలతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాడు యశ్‌. ప్రశాంత్‌నీల్‌

Published : 17 Sep 2022 18:13 IST

చెన్నై: ‘కేజీయఫ్‌ 1, 2’ చిత్రాలతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాడు యశ్‌. ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన ఆ చిత్రాలతో యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. మరి ‘కేజీయఫ్‌’ తర్వాత యశ్‌ చేయబోయే చిత్రం ఏంటి? ప్రస్తుతం సినీ అభిమానుల అందరిలోనూ ఇదే ప్రశ్న మెదులుతోంది. దీనికి సమాధానంగా ఓ వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. భారీ సినిమాల దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో యశ్‌ తన తర్వాతి చిత్రాన్ని చేస్తారని టాక్‌ నడుస్తోంది. రూ.1000కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. కరణ్‌ జోహార్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా, పెన్‌ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉంది. ఇంతకీ కథేంటో తెలుసా? తమిళ ఎపిక్‌ నవల ‘వల్పరి’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. సు.వెంకటేశన్‌ రాసిన ఈ నవల సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం శంకర్‌ రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. కమల్‌హాసన్‌తో కలిసి ‘భారతీయుడు-2’ తీస్తుండగా, రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ‘ఆర్‌సీ15’ వర్కింగ్‌ టైటిల్‌తో మరో చిత్రం తెరకెక్కుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని