Writer Padmabhushan: వినోదాలు పంచే ‘రైటర్ పద్మభూషణ్’
‘‘నా దృష్టిలో రచయితే అన్నింటికీ మూలం. ఎంత బడ్జెట్ పెట్టినా మొదట కథ రాయాల్సింది అతనే. అలాంటి ఓ రచయిత ప్రయాణాన్నే మా ‘రైటర్ పద్మభూషణ్’లో చూపించాం’’ అన్నారు షణ్ముఖ ప్రశాంత్.
‘‘నా దృష్టిలో రచయితే అన్నింటికీ మూలం. ఎంత బడ్జెట్ పెట్టినా మొదట కథ రాయాల్సింది అతనే. అలాంటి ఓ రచయిత ప్రయాణాన్నే మా ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan)లో చూపించాం’’ అన్నారు షణ్ముఖ ప్రశాంత్(Shanmukha Prasanth). ఆయనకిది దర్శకుడిగా తొలి చిత్రం. సుహాస్ (Suhas) హీరోగా నటించారు. టీనా శిల్పరాజ్ (Tina) కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు దర్శకుడు ప్రశాంత్.
‘‘ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రమే. అలాగని వేడుకలు, చుట్టాలు.. ఇలాంటి మెలో డ్రామాలా ఉండదు. మన ఇంట్లో జరిగే కథలాగే ఉంటుంది. ఒక కొత్త కథ చెప్పాలనే ఆలోచన నుంచి ఈ స్క్రిప్ట్ పుట్టింది. ఇందులో హీరో పాత్ర పేరు పద్మభూషణ్ (Padmabhushan). తనొక లైబ్రేరియన్. ఓ రచయిత కావాలని అనుకుంటాడు. మరి తను అనుకున్నది ఎలా సాధించాడు.. ఈ ప్రయాణం ఎలా సాగింది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి’’.
* ‘‘సుహాస్ (Suhas)తో సినిమా అంటే కథే బలంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేశా. విజయవాడలో ఉండే ఓ మధ్యతరగతి కుర్రాడి జర్నీ ఇది. తనకొక కుటుంబం.. ప్రేమించే అమ్మాయి ఉంటుంది. అయితే తను ఏం కావాలనుకున్నాడు.. చివరికి ఏమయ్యాడు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’.
* ‘‘నాకు కామెడీ చాలా ఇష్టం. నా బలం కూడా అదే. ఈ చిత్రంలో చాలా మంచి వినోదం ఉంది. ఆశిష్ విద్యార్థి పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. రోహిణి, గోపరాజు రమణ ఇలా చాలా మంది మంచి నటులు చేశారు. నాయిక శిల్పారాజ్, గౌరీ ప్రియ చాలా అద్భుతంగా చేశారు’’.
* ‘‘మాది విజయవాడ. అక్కడే బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్కు వచ్చా. ఆరంభంలో కొందరి దగ్గర రచయితగా పని చేశా. బాగా రాస్తున్నానని మెచ్చుకునే వారు కానీ, ఏం ఇచ్చేవారు కాదు (నవ్వుతూ). అయితే వారి మాటలు నాపై నమ్మకాన్ని పెంచేవి. సుహాస్తో షార్ట్ఫిల్మ్స్ రోజుల నుంచి పరిచయం. ఆయన ‘కలర్ఫొటో’కు సహాయ దర్శకుడిగా.. ‘ఫ్యామిలీడ్రామా’కు రచయితగా పని చేశా. ఇప్పుడీ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన