ఓటీటీలో విడుదలైన ‘శశి’ 

ఆది, సురభి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘శశి’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో తాజాగా విడుదలైంది. శ్రీనివాస్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆర్‌.పి.వర్మ, చావలి రామాంజనేయులు, చింతలపూరి శ్రీనివాస్‌రావు నిర్మించారు.

Published : 14 Apr 2021 20:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆది, సురభి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘శశి’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో తాజాగా విడుదలైంది. శ్రీనివాస్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆర్‌.పి.వర్మ, చావలి రామాంజనేయులు, చింతలపూరి శ్రీనివాస్‌రావు నిర్మించారు. అరుణ్‌ చివులూరు సంగీతం అందించారు. రాశీసింగ్‌, జయప్రకాశ్‌, రాజీవ్‌కనకాల కీలక పాత్రలు పోషించారు. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని