Sekhar: ‘శేఖర్‌’ విషయంలో నిర్మాతల మాటకే కట్టుబడి ఉంటాం: రాజశేఖర్‌

రాజశేఖర్‌ నటించిన ‘శేఖర్‌’ సినిమా చట్టపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఆర్థిక లావాదేవీల విషయమై ఫైనాన్షియర్‌ పరంధామరెడ్డి సిటీ సివిల్‌ కోర్టును ...

Published : 24 May 2022 01:04 IST

హైదరాబాద్‌: రాజశేఖర్‌ నటించిన ‘శేఖర్‌’ సినిమా చట్టపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఆర్థిక లావాదేవీల విషయమై ఫైనాన్షియర్‌ పరంధామరెడ్డి సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తయ్యాక, చిత్ర ప్రదర్శనలను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని చోట్లా సినిమా ప్రదర్శన ఆగిపోయింది. ఈ విషయమై కోర్టులో  చిత్ర బృందం మరోసారి వాదనలు వినిపించినట్టు తెలుస్తోంది. మరోవైపు, ట్విటర్‌ వేదికగా రాజశేఖర్‌ స్పందించారు. ‘‘కొందరు కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారు. సినిమాను నిలిపివేయడం వల్ల మేమంతా నష్టపోయాం. ‘శేఖర్‌’కు తగిన గుర్తింపు తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నా. ఈ సినిమా స్క్రీనింగ్‌ విషయంలో మేం నిర్మాత మాటకు కట్టుబడి ఉంటాం. వారు ఏం చెబితే అలా నడుచుకుంటాం’’ అని రాజశేఖర్‌ పేర్కొన్నారు. 

రాజశేఖర్‌ హీరోగా ఆయన సతీమణి, నటి జీవిత తెరకెక్కించిన చిత్రమే ‘శేఖర్’. మే 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళ సినిమా ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ రూపొందింది. ఇందులో రాజశేఖర్‌ తనయ శివానీ ఓ కీలక పాత్ర పోషించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని