Vidya Balan: ‘షేర్నీ’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

 బాలీవుడ్ న‌టి విద్యా బాలన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘షేర్నీ’. అమిత్ మ‌సుర్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జూన్ 18 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ట్రైల‌ర్ విడుద‌లైంది.

Published : 02 Jun 2021 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  బాలీవుడ్ న‌టి విద్యా బాలన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘షేర్నీ’. అమిత్ మ‌సుర్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జూన్ 18 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో అట‌వీ శాఖ అధికారిగా క‌నిపించింది విద్యా బాల‌న్‌. మనిషి-జంతు సంఘర్షణా ప్రపంచంలో సమతౌల్యం తెచ్చేందుకు పోరాడుతూ ఉంటుంది. అడ‌వి నేప‌థ్యంలో సాగిన స‌న్నివేశాలు, నేప‌థ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. మ‌రి షేర్నీ అనుకున్న‌ది సాధించిందా, లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో శరద్‌ సక్సేనా, ముకుల్‌ చద్ధా, విజయ్‌ రాజ్‌, అరుణ్‌, బ్రిజేంద్ర కాలా, నీరజ్‌ కబి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు నిర్మించాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని