Shikhar Dhawan: వెండితెరపై శిఖర్‌ ధావన్‌

సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’. సినిమా ప్రకటించింది మొదలు రోజుకో కొత్త విశేషంతో అలరిస్తున్నారు రూపకర్తలు.

Updated : 12 Oct 2022 07:22 IST

సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), హ్యూమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ (Double XL). సినిమా ప్రకటించింది మొదలు రోజుకో కొత్త విశేషంతో అలరిస్తున్నారు రూపకర్తలు. తాజాగా స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) ఇందులో భాగమవుతున్నారనే కబురు చెప్పారు. ఈ సందర్భంగా హ్యూమా.. ధావన్‌ని ఆరాధనగా చూస్తున్న స్టిల్‌ని మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. సినీతారలు, క్రికెటర్లు కలిసి నటించడం.. అభిమానులకు ఎప్పుడైనా పండగలాంటి విషయమే. ఇందులో శిఖర్‌ అతిథి పాత్రలో అలరించనున్నట్టు సమాచారం. ఇద్దరు బొద్దుగుమ్మలు తమ స్వప్నాల వెంట పరుగులు తీసే క్రమంలో.. వాళ్లకి ఎదురైన అనుభవాలే చిత్ర కథాంశం. ఈ కామెడీ డ్రామాకి సత్రామ్‌ రమణి దర్శకుడు. వాకూ ఫిల్మ్స్‌, ముదస్సర్‌ అజీజ్‌ నిర్మాతలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని