Siddharth: ఆరోజు తప్పకుండా నటనకు స్వస్తి పలుకుతా: సిద్ధార్థ్‌

నటనకు స్వప్తి పలకడంపై నటుడు సిద్ధార్థ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ వెబ్‌సిరీస్‌ ‘ఎస్కేప్ లైవ్’. సిద్ధార్థ్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌ మే 20 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో...

Published : 14 May 2022 10:04 IST

హైదరాబాద్‌: నటనకు స్వప్తి పలకడంపై నటుడు సిద్ధార్థ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ వెబ్‌సిరీస్‌ ‘ఎస్కేప్ లైవ్’. సిద్ధార్థ్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌ మే 20 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. చాలా ఏళ్ల తర్వాత హిందీలో నటించడంపై  తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్‌ స్పందించారు.

‘‘నటుడిగా నా కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి నేను ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లోనే నటించాను. అందువల్ల చాలామంది నేను దిల్లీ అబ్బాయిననే విషయాన్ని మర్చిపోయారు. హిందీ చాలా బాగా మాట్లాడతాను. ఆసక్తికరమైన పాత్రలు వచ్చినప్పుడల్లా హిందీ చిత్రాల్లో నటిస్తుండటం ఒక అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా సిద్ధార్థ్‌ కుమార్‌ ‘ఎస్కేప్‌ లైవ్‌’ కథ చెప్పారు. కథ నాకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశాను. ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చినంతవరకూ నేను సినిమాల్లో నటిస్తాను. అలాంటి అవకాశాలు రానప్పుడు తప్పకుండా నటనకు స్వస్తి పలికి వేరే ఉద్యోగం వెతుక్కుంటాను’’ అని సిద్ధార్థ్‌ వివరించారు.

శంకర్‌ తెరకెక్కించిన ‘బాయ్స్‌’తో హీరోగా పరిచయమైన సిద్ధార్థ్‌ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..!’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఓ మై ఫ్రెండ్‌’ ఇలా పలు ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రం ‘మహాసముద్రం’. గతేడాదిలో విడుదలైన ఈసినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని