‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్‌  

శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’, ఇందులో కథానాయికలుగా అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు. ప్రేమతో కూడిన యాక్షన్‌ డ్రామా కథగా సినిమా తెరకెక్కుతుంది.

Published : 17 Apr 2021 14:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్: శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ప్రేమతో కూడిన యాక్షన్‌ డ్రామా కథగా సినిమా తెరకెక్కుతోంది. శనివారం హీరో సిద్ధార్థ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

దర్శకుడు అజయ్ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ...‘‘మీ అందరి హృదయాలను గెలుచుకోవడానికి ప్రిన్స్ మళ్లీ వచ్చారు’’ అంటూ పేర్కొన్నారు. జగపతిబాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఆగస్టు 19న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని