SIIMA: సెప్టెంబర్‌లో ‘సైమా’ వేడుక.. నామినేట్‌ అయిన సినిమాలివే..

దక్షిణాదిన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సైమా(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుక కరోనా కారణంతో మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోలేదు. అయితే.. 2019 ఏడాదికి సంబంధించి ‘సైమా’ పురస్కారాల ప్రదానోత్సవాలను ఈ సంవత్సరం నిర్వహించనున్నారు.

Published : 16 Aug 2021 19:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాదిన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సైమా(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుక కరోనా కారణంతో మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోలేదు. అయితే.. 2019 ఏడాదికి సంబంధించి ‘సైమా’ పురస్కారాల ప్రదానోత్సవాలను ఈ సంవత్సరం నిర్వహించనున్నారు. ఈ మేరకు ‘సైమా’ ఛైర్‌ పర్సన్‌ బృందాప్రసాద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే సెప్టెంబర్‌లో పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ఆమె తెలిపారు. ఈసారి నామినేట్‌ అయిన సినిమాలు ఇండస్ట్రీలకు ఒక బెంచ్‌మార్క్‌ను నిర్దేశించాయన్నారు. దీంతోపాటు వివిధ విభాగాల్లో నామినేట్‌ అయిన సినిమాలు.. అత్యంత ఆదరణ పొందిన చిత్రాలుగా మహర్షి(తెలుగు), అసురన్‌(తమిళం), యజమాన(కన్నడ), కుంబళంగి నైట్స్(మలయాళం) చిత్రాలు నామినేషన్‌లో ముందంజలో నిలిచాయి.

మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్‌. ఈ చిత్రం పది నామినేషన్లతో ముందంజలో ఉండగా.. ‘మజిలీ’ 9, ‘జెర్సీ’ 7 నామినేషన్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తమిళంలో ధనుష్‌ హీరోగా నటించిన ‘అసురన్‌’ 10 నామినేషన్లు, కార్తీ చిత్రం నటించిన ‘ఖైదీ’ 8 నామిరనేషన్లతో ఉన్నాయి. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘కుంబళంగి నైట్స్‌’ నుంచి ఏకంగా 13 నామినేషన్లు వచ్చాయి. కన్నడ చిత్రం ‘యజమాన’ నుంచి 12 నామినేషన్లు దాఖలయ్యాయి. విజేతలను ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా నిర్ణయించునున్నారు. ప్రజలు www.siima.in వెబ్‌సైట్‌తో పాటు SIIMA ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తమ అభిమాన చిత్రానికి ఓట్లు వేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని