singer sunitha: ‘మీకో దండం రా నాయనా’ ఆ వార్తలపై గాయని సునీత అసహనం

సోషల్‌మీడియా, యూట్యూబ్‌ ఛానళ్లు పెరిగిన తర్వాత సినిమా సెలబ్రిటీల గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Published : 24 Apr 2022 01:36 IST

హైదరాబాద్‌: సోషల్‌మీడియా, యూట్యూబ్‌ ఛానళ్లు పెరిగిన తర్వాత సినిమా సెలబ్రిటీల గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది వాటిని చూసి నవ్వుకుని వదిలేస్తారు. గౌరవానికి భంగం వాటిల్లే వార్తలు వస్తే మాత్రం సీరియస్‌గానే స్పందిస్తారు. అలాంటి సమస్యే ప్రముఖ గాయని సునీతకు ఎదురైంది. ఇటీవల ఆమె అభిమానులతో పంచుకున్న ఓ ఫోటోనే అందుకు కారణమైంది. ఓ మామిడి చెట్టు వద్ద ఫొటో దిగి ‘ఆశీర్వాదం పొందాను’ అంటూ ఏంజిల్‌ ఎమోజీని పంచుకున్నారు సునీత. ఇంకేముంది.. సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ‘సింగర్‌ సునీత తల్లికాబోతుందా’ అందుకే ‘మామిడి చెట్టు దగ్గర ఫొటో దిగిందా’ అంటూ పోస్టులు పెట్టారు. ఈ వార్తల సునీత దృష్టి రావడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పుకార్లను ప్రచారం చేయొద్దని మండిపడ్డారు.

‘‘ఓరి దేవుడా! జనాలు ఎంత క్రేజీగా ఉన్నారు. మామిడి చెట్టుకు తొలిసారి కాయలు కాయడంతో వాటితో ఫొటో దిగి సోషల్‌మీడియాలో పంచుకున్నాను. దాన్ని ఇలా ప్రచారం చేస్తారా? ఊహాజనిత వార్తలు, పుకార్లను వ్యాప్తి చేయడం ఆపండి. దండం రా నాయనా’’ అంటూ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని