మా అన్నయ్య వెళ్లిపోయారు: సిరివెన్నెల భావోద్వేగం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీ గేయ రచయిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో

Updated : 26 Sep 2020 09:56 IST

హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘మా అన్నయ్య వెళ్లిపోయారు. మాటలను తీసుకొని వెళ్లిపోయారు. నాకు మాటలు రావడం లేదు. భారతీయ సంస్కృతిలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగం బాలు. మా అన్నయ్య మరణం దిగ్ర్భాంతికరం. ఆయన మరణం కాల ధర్మం కాదు.. అకాల  సూర్యాస్తమయం. బాలు గారు ఎంత గొప్ప గాయకుడు. సినిమా పాటకు అద్భుతమైన స్థాయి తెచ్చినటువంటి గాయకుల్లో బాలు గారు ఒకరు అవడమే కాదు.. తెలుగు సినిమా పాటకు ప్రాతినిధ్యం బాలు గారు. సినిమా పాటలకు ఆయన సంరక్షకుడు.. పెద్ద దిక్కు’’ అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి భావోద్వేగంతో మాట్లాడారు. ఆ పూర్తి వీడియో మీకోసం..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని