Sitara Ghattamaneni: ఇకపై అవి ఇంతకు ముందులా ఉండవు.. సితార ఎమోషనల్ పోస్ట్‌

సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం పట్ల ఆయన మనవరాలు, మహేశ్‌ బాబు కుమార్తె భావోద్వేగానికి గురైంది. 

Published : 16 Nov 2022 13:11 IST

హైదరాబాద్‌: తన తాతయ్య, సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం పట్ల భావోద్వేగానికి గురయ్యారు మహేశ్‌బాబు కుమార్తె సితార. తాతయ్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆమె ఇన్‌స్టా వేదికగా బుధవారం ఓ పోస్ట్‌ పెట్టారు. కృష్ణతో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేసిన ఆమె.. ‘‘ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాత గారు.. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటా. మిమ్మల్ని బాగా మిస్‌ అవుతున్నా’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెటిజన్ల హృదయాన్ని తాకింది. ‘బి స్ట్రాంగ్ సితూ పాప’ అంటూ పలువురు సోషల్‌మీడియా యూజర్లు కామెంట్స్‌ జత చేస్తున్నారు. మరోవైపు మహేశ్‌బాబు తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి పార్థివ దేహాన్ని చూసి ఆయన తీవ్ర ఉద్వేగానికి గురవుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని