కరోనాపై అదా పంచ్‌.. ఐదేళ్ల ‘సరైనోడు’

‘వైఫై కంటే చెట్ల వలనే ఎన్నో ఉపయోగాలున్నాయి’ అంటోంది కాజోల్‌. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా చెట్టు కింద కూర్చున్న ఫొటోని పంచుకుంటూ ఇలా రాసుకొచ్చింది. 

Published : 23 Apr 2021 01:15 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు అర్జున్‌.

‘వైఫై కంటే చెట్ల వల్లే ఎన్నో ఉపయోగాలున్నాయి’ అన్నారు నటి కాజోల్‌. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా చెట్టు కింద కూర్చున్న ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇలా రాసుకొచ్చారామె.

* బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ దుస్తుల్లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది యువ నాయిక ఈషా రెబ్బా.

* పసుపు వర్ణ చీరని ధరించి అందరి చూపుని తనవైపు తిప్పుకుంటోంది నటి అంజలి.

* ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకుంటూ ‘మీరు నవ్వేందుకు ఇది మార్గంగా నిలిచింది. నా జీవితంలో నేను కోరుకునేది ఇదే’ అని చెప్పుకొచ్చింది బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా.

* ‘కరోనా గో!’ అంటూ బాక్సింగ్‌ ఫొటోల్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది అదాశర్మ.





















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని