Ratnababu: విద్యార్థిలా ఎదురుచూస్తున్నా
‘‘న్యాయవ్యవస్థలోని లొసుగుల్ని ప్రశ్నించే పాత్రతోనే ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రాన్ని తెరకెక్కించా’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ఆయన దర్శకత్వంలో మోహన్బాబు కథానాయకుడిగా రూపొందిన చిత్రమిది. మంచు విష్ణు నిర్మాత. శుక్రవారం ప్రేక్షకుల
‘‘న్యాయవ్యవస్థలోని లొసుగుల్ని ప్రశ్నించే పాత్రతోనే ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రాన్ని తెరకెక్కించా’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ఆయన దర్శకత్వంలో మోహన్బాబు కథానాయకుడిగా రూపొందిన చిత్రమిది. మంచు విష్ణు నిర్మాత. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా డైమండ్ రత్నబాబు బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఇదొక ప్రయోగాత్మక చిత్రం. కరోనా సమయంలో రైతుల్ని, వైద్యుల్ని పొగిడాం. వాళ్లతోపాటు సినిమావాళ్లూ గొప్పవాళ్లే అని అప్పట్లో నాకు అనిపించింది. సినిమాలవల్ల వినోదాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని గడిపినవాళ్లు చాలామందే. అలా సినిమాపై నాకున్న ప్రేమని వ్యక్త పరిచే అవకాశం ఈ చిత్రంతో వచ్చింది. ఆ సమయంలోనే నేను ఈ కథని మోహన్బాబుకి వినిపించా. ఓటీటీ కోసమనే మొదలు పెట్టాం. పూర్తయ్యాక ‘థియేటర్లని ప్రేమించే వ్యక్తిగా నాకు దీన్ని ఓటీటీలో విడుదల చేయడం ఇష్టం లేద’ని మోహన్బాబు అన్నారు. మంచి సంభాషణలు, ఓ సరికొత్త ప్రయోగంలా రూపుదిద్దుకున్న ఈ సినిమా థియేటర్లలోనే రావాలని ఆయన చెప్పారు. 1 గంట 30 నిమిషాల నిడివున్న చిత్రమిది. విరూపాక్ష అనే పాత్రలో మోహన్బాబు కనిపిస్తారు. ప్రైవేట్ స్కూళ్లు, ఆసుపత్రుల తరహాలో ఇందులో కథానాయకుడు ప్రైవేట్ జైలుని నడుపుతుంటాడు. ఆ నేపథ్యమంతా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ఫలితం కోసం పరీక్షలు రాసిన ఓ విద్యార్థిలా ఎదురుచూస్తున్నా’’అని తెలిపారు డైమండ్ రత్నబాబు. త్వరలోనే మోహన్బాబు, మంచు లక్ష్మీలతో ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!