Son of India: ‘ప్రపంచం బాధే నా బాధ’.. పవర్‌ఫుల్‌గా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ట్రైలర్‌!

మోహన్‌ బాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ట్రైలర్‌. రత్నబాబు తెరకెక్కించిన చిత్రం త్వరలోనే విడుదలకానుంది.

Updated : 10 Feb 2022 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ప్రపంచమంతా నా కుటుంబం. ప్రపంచం బాధే నా బాధ’ అని అంటున్నారు ప్రముఖ నటుడు మోహన్‌బాబు. ఆయన హీరోగా నటించిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రంలోని సంభాషణ ఇది. ఈ సినిమాను ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘ప్రపంచంలోని ఏ పోరాటమైనా ఒకడితోనే ప్రారంభమవుతుంది’ అనే డైలాగ్‌తో ప్రారంభయ్యే ట్రైలర్‌ ఆద్యంతం పవర్‌ఫుల్‌గా సాగింది. ఈ ప్రచార చిత్రంలో మోహన్‌బాబు విభిన్నమైన లుక్స్‌లో.. చాలా శక్తిమంతంగా కనిపించారు. ఆయన చెప్పిన ప్రతి సంభాషణ ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఉంది. ఆఖర్లో.. ‘మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం మీతోపాటు 138 కోట్ల భారతీయులకు వివరంగా చెబుతా’ అని మోహన్‌బాబు ఫోన్లో చెప్పే మాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సమాధానం ఏంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రీకాంత్‌, అలీ, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని