Ganguly: బయోపిక్ వచ్చేస్తోంది!
తన బయోపిక్లో నటించేందుకు ఇద్దరు ముగ్గురు నటులు పేర్లు పరిశీలించగా .. రణ్బీర్ కపూర్ అయితే బాగుంటాడని దాదా చెప్పారట
కోల్కతా: బాలీవుడ్లో వచ్చిన క్రీడాకారుల బయోపిక్లు ప్రేక్షకులను మెప్పించాయి. మేరీకోమ్, ఎం.ఎస్ ధోని, మిల్కా సింగ్, సైనాపై వచ్చిన సినిమాలు ఆ కోవకు చెందినవే. తాజాగా మరో దిగ్గజ క్రికెటర్ బయోపిక్ సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టీమ్ ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ జీవిత ఆధారంగా తెరకెక్కనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన బయోపిక్ తెరకెక్కనున్న విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తన బయోపిక్లో నటించేందుకు ఇద్దరు ముగ్గురు నటులు పేర్లు పరిశీలించగా .. రణ్బీర్ కపూర్ అయితే బాగుంటాడని దాదా చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్ మొత్తం సిద్ధం కాగా, ప్రొడక్షన్ హౌస్ పలు మార్లు గంగూలీతో చర్చలు జరిపింది. ఇక దర్శకుడు, నటీనటులు ఎవరన్నది త్వరలోనే ప్రకటిస్తారు.
క్రికెట్ + సినిమా కలిస్తే..
వెండితెరపై స్టేడియం కనిపిస్తే సినీ ప్రియులతో పాటు క్రీడా అభిమానులకు ఉత్సాహం రెట్టింపవుతుంది. గతంలో క్రికెట్ ఆటగాళ్ల చిత్రాలు.. 2016లో మహ్మద్ అజహరుద్దీన్ ‘అజర్’, 2017లో ధోని ‘ఎం.ఎస్ ధోని’, సచిన్ తెందూల్కర్ డాక్యుమెంటరీ ‘ సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’.. ఇలా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించినవే. ప్రస్తుతం టీమ్ ఇండియా మాజీ సారథి కపిల్దేవ్ ‘83’తో పాటు మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిల బయోపిక్స్ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు