ఎస్పీబీ ఆరోగ్యం: అవన్నీ ఫేక్ న్యూస్!
కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అన్నారు. తన తండ్రి ఆరోగ్యంపై
చెన్నై: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అన్నారు. తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న అసత్య వార్తలను ఖండించారు. ఏ విషయాన్నైనా తమ ద్వారా ధ్రువీకరించుకున్న తర్వాతే ప్రచురించాలని మీడియాను కోరారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని పంపారు.
‘‘నాన్న నెమ్మదిగా కోలుకుంటున్నారు. అందుకు సమయం పడుతుంది. ఆయన ఆరోగ్యం విషయంలో భారీ మార్పులు ఏవీ లేవు. అందుకే నేనూ రోజూ అప్డేట్ ఇవ్వడం లేదు. ప్రతి రోజూ నాన్నను కలుస్తున్నా. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఇంకా ఎక్మో, వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అయితే, ఇన్ఫెక్షన్కు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవు. మీ ప్రార్థనలు, ప్రేమాభిమానాల వల్ల ఆయన కోలుకుంటున్నారు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నాన్న ఆరోగ్యానికి సంబంధించి ఒకట్రెండు రోజులకైనా నేను అప్డేట్లు ఇస్తూనే ఉన్నా. అయితే, కొన్ని మీడియా సంస్థలు ప్రచురిస్తున్న వార్తలను అనుసరించవద్దు. వాళ్లు ఎక్కడి నుంచి సమాచారం సేకరిస్తున్నారో తెలియదు. నాన్న ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను. లేదా ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేస్తాయి. నాన్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, ఆయన ఊపిరితిత్తుల మార్పిడికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అది నిజం కాదు. ఒకే రోజు ఇలాంటి రెండు రకాల వార్తలు వచ్చాయి. ఆయన అభిమానుల కోసం ఐసీయూ నుంచి పాట పాడతారన్న వార్తలు కూడా వాస్తవం కాదు. దయచేసి మీడియా సంయమనం పాటించండి. మీరు రాసే వార్తల వల్ల ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఒక ఫేక్ న్యూస్ కారణంగా వందల కాల్స్కు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఏదైనా విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు నాకు గానీ, నా వ్యక్తిగత కార్యదర్శికి గానీ ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నాన్న పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి వస్తారని అందరం ఆశిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు’’ అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. ఇటీవల బాలసుబ్రహ్మణ్యానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!