Tollywood: ఓటీటీ నిండుగా.. సినిమా పండగ
ఓటీటీలో అలరిస్తున్న తెలుగు సినిమాలు
ఓటీటీ వేదిక ఇప్పుడు సొంతింటి వెండితెరలా మారిపోయింది. ఒకప్పుడు థియేటర్లలో విడుదలయ్యాకే ఓటీటీ బాట పట్టే సినిమాలు.. కొంతకాలంగా నెట్ఫ్లిక్స్, ఆహా, అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్ వేదికలపై నేరుగా వినోదాల విందును పంచుతున్నాయి. ఈ ఏడాది చిన్నచితకా హీరోలే కాదు, స్టార్ కథానాయకుల సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. అలా ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు ఏ ప్లాట్ఫామ్పై అందుబాటులో ఉన్నాయో చూద్దాం.
నారప్పను చూసి తీరాలప్ప
కమర్షియల్ సినిమాలకు టాలీవుడ్లో కొదవలేదు. సామాజిక అంశానికి కమర్షియల్గా చెప్పడంలో నారప్ప’ విజయం సాధించింది. తమిళ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ వెంకటేశ్ నటనతో కట్టిపడేశాడు. ‘నారప్ప’గా వయసుమీరిన పాత్రలో విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఓటీటీలో విడుదలై విజయం సాధించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ప్రియమణి కథానాయిక. అమెజాన్ ప్రైమ్లో ఉందీ చిత్రం.
టక్ జగదీశ్
నాని గతేడాది ‘వి’ అనే యాక్షన్ థ్రిల్లర్ని అమెజాన్ ప్రైమ్లో డైరెక్ట్గా విడుదల చేశాడు. ‘టక్ జగదీశ్’ను థియేటర్లలో అందించాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఓటీటీ బాట పట్టిందీ చిత్రం. స్టైలిష్ లుక్తో నాని అదరగొట్టాడు. ప్రస్తుత పండగ వాతావరణానికి ఇది సరైన చిత్రం. సినిమా నిండా కుటుంబ భావోద్వేగాలను పండించాడు దర్శకుడు. మిశ్రమ స్పందన లభించినప్పటికీ కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది!
కితకితల చోరుడు
సినిమా ఏదైనా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా జాగ్రత్తపడతాడు శ్రీవిష్ణు. అలా ఈ ఏడాది థియేటర్లలో విజయం సాధించిన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా చేశారు. కథనంతోనే ఆకట్టుకునే ఈ సినిమాలో వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇది బుల్లితెర మీద అలరించేందుకు జీ5లో విడుదలైంది.
థ్రిల్లింగ్.. మాస్ట్రో
కమర్షియల్, రొమాంటిక్ లవ్స్టోరీలతో ఆకట్టుకున్న హీరో నితిన్. ఈ సారి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హిందీ సూపర్ హిట్ ‘అంధాదూన్’ కి ఇది రీమేక్. నభా నటేష్ హీరోయిన్. తమన్నా లేడీ విలన్గా నటించారు. ఓ హత్య చుట్టూ జరిగే ఈ సినిమా కథలోని మలుపులు వీక్షకులకు ఊపిరాడనివ్వవు. ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.
నవ్వుల రత్నాలు
కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ‘జాతిరత్నాలు’ విజయవంతమైంది. కొవిడ్ విలయ తాండవానికి విలవిల్లాడిన జనాలకు కామెడీ టానిక్లా పనిచేసిందీ చిత్రం. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామక్రిష్ణ జోగిపేట్ నుంచి హైదరాబాద్కు వచ్చి చేసిన హంగామాను చూసి తీరాల్సిందే. మీరూ ఆ హాస్యపు జల్లుల్లో తడవాలంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది చూసేయండి.
తిమ్మరుసు న్యాయం
సత్యదేవ్ నిజాయతీపరుడైన లాయర్ రామ్గా నటించిన సినిమా ‘తిమ్మరుసు’. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేసును రామ్ రీఓపెన్ చేస్తాడు. అప్పటి నుంచి అడుగడుగున ఆటంకాలు ఏర్పడతాయి. ఆ కేసులో శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? తన ప్రయత్నాలకు ఎవరు అడ్డుపడుతున్నారనేది తెలుసుకునే కొద్ది ఉత్కంఠ రేగుతుంది. ఈ థ్రిల్ను ఆస్వాదించాలంటే నెట్ఫ్లిక్స్లో ఉంది చూసేయండి.
నరేశ్ నాంది
హాస్య చిత్రాలను చేస్తూ వచ్చిన అల్లరి నరేశ్ రూటు మార్చి తీసిన సీరియస్ క్రైమ్ డ్రామా ‘నాంది’. నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీగా నరేశ్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇది ఆహాలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి