Cinema News: ఇదీ భామల బ్రాండ్
నాలుగు పరాజయాలు పలకరించినా వచ్చిన ఇబ్బందేం లేదు.. కెరీర్ ఢోకా ఉండదు. ఇదీ టాలీవుడ్లో కథానాయకుడి వరస. అదే హీరోయిన్ విషయానికొస్తే రెండు ఫట్లు వస్తే ఏకంగా ఫేట్ మారిపోతుంది. ఫ్లాప్ కథానాయిక అనే ముద్ర పడిపోతుంది.
హిట్టు లేకున్నా.. కనికట్టు చేస్తున్నారు
నాలుగు పరాజయాలు పలకరించినా వచ్చిన ఇబ్బందేం లేదు.. కెరీర్ ఢోకా ఉండదు. ఇదీ టాలీవుడ్లో కథానాయకుడి వరస. అదే హీరోయిన్ విషయానికొస్తే రెండు ఫట్లు వస్తే ఏకంగా ఫేట్ మారిపోతుంది. ఫ్లాప్ కథానాయిక అనే ముద్ర పడిపోతుంది. మళ్లీ హిట్టు కొడితేగానీ టాప్ హీరోలు, అగ్ర దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం దొరకదు. అలా కనుమరుగైన కథానాయికలు చాలామందే. కానీ ఈమధ్యకాలంలో ట్రెండు మారినట్టే కనిపిస్తోంది. వాళ్ల కెరీర్పై పరాజయాల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. వరుస ఫెయిల్యూర్లు మూటగట్టుకున్నా.. పిలిచి అవకాశాలిస్తున్నారు.ఎందుకిలా? అంటే ‘కథానాయికల కొరత’ అన్నది సమాధానం. ఇక సీనియర్ భామలైతే వాళ్లకున్న అనుభవం, క్రేజ్తో కొత్త ప్రాజెక్టులు కొల్లగొడుతున్నారు.
సాయిపల్లవి, కృతిశెట్టి, రాశిఖన్నా తదితర కథానాయికలు ఈమధ్య తెలుగులో చేసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అయినా సరే, క్రమం తప్పకుండా అవకాశాల్ని అందుకుంటూనే ఉన్నారు. ‘ఉప్పెన’తో ఆకట్టుకున్న కృతిశెట్టికి తర్వాత ఆ స్థాయి విజయమే దక్కలేదు. అయినా ఆమె తెలుగు, తమిళ భాషల్లో బిజీ బిజీగా ఉంది. ఇక సాయిపల్లవి సినిమా ఒప్పుకొంటే చాలన్నట్టుగా ఎదురు చూస్తుంటారు దర్శకనిర్మాతలు. ఆమెకి అంత క్రేజ్. రాశిఖన్నాని పరాజయాలు పలకరిస్తున్నకొద్దీ ఆమె తన కెరీర్ని మరింతగా పరుగులు పెట్టిస్తోంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం భాషలపై దృష్టిపెట్టి వరుసగా సినిమాలు చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్కి కొంతకాలంగా చెప్పుకోదగ్గ విజయం లేకపోయినా, అవకాశాల్ని అందుకుని ‘కార్తికేయ2’తో మళ్లీ ఫామ్లోకి వచ్చింది. నవతరం భామలు ఫలితాలతో సంబంధం లేకుండా తమదైన ప్రభావం చూపిస్తూనే ఉన్నారు.
జోరు సాగనీ...
అటు నటనతోనూ... ఇటు అందం పరంగా ప్రభావం చూపించిన తారల కెరీర్కి ఎప్పటికీ తిరుగుండదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వాళ్ల ప్రయాణం కొనసాగడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తెలుగులో నటిస్తున్న సీనియర్ భామల్లో ఎక్కువశాతం అలాంటివాళ్లే. ‘ఓ బేబీ’ తర్వాత తెలుగులో సమంతకి చెప్పుకోదగ్గర సినిమా లేదు. అయినా వరుసగా సినిమాలు చేస్తూ, ‘పుష్ప’తో వచ్చిన ప్రత్యేక గీతం అవకాశం తర్వాత మళ్లీ జోరు చూపించడం మొదలుపెట్టింది. ‘శాకుంతలం’ సినిమాని పూర్తి చేసిన ఆమె ‘యశోద’, ‘ఖుషి’ల్లో నటిస్తోంది. మరికొన్నింటిలోనూ ఆమె పేరు వినిపిస్తోంది. అనుష్క తొలినాళ్లల్లో అందంపైనే దృష్టిపెట్టినా, ‘అరుంధతి’తో ఆమె తనలోని మరో కోణాన్ని చూపించింది. అప్పట్నుంచి క్రమం తప్పకుండా నటనకి ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ వస్తోంది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత ఆమె కెరీర్లో వేగం తగ్గినప్పటికీ, ‘నిశ్శబ్దం’ వంటి పరాజయం ఎదురైనప్పటికీ ఆమెకి కథలు వినిపించేందుకు దర్శకనిర్మాతలు వరుస కట్టారు. అయినా ఆచితూచి ముందడుగు వేస్తోంది. ఆమెకున్న బ్రాండ్ అలాంటిది. ఇటీవలే నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ చిత్రం కోసం రంగంలోకి దిగింది. ‘పుష్ప’ సినిమాతో నటిగా సత్తా చాటిన రష్మిక మందన్న, ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’తో పరాజయాన్ని చవిచూసింది. అయినా సరే, ఆమె జోరు తగ్గలేదు. హిందీలోనూ, తమిళంలోనూ వరుసగా అవకాశాల్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘సీతారామం’తో మళ్లీ ఫామ్లోకి వచ్చింది. ‘వారసుడు’లో నటిస్తూ, ‘పుష్ప2’ కోసం మరోసారి శ్రీవల్లిగా రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. తమన్నాకి ఆమె అనుభవమే ఓ బ్రాండ్. ఎంత పోటీ ఎదురైనా, పరాజయాలతో ఆటుపోట్లు ఎదురైనా ఆమెని ఎప్పటికప్పుడు అగ్ర పథాన నిలబెడుతోంది అనుభవమే. వాణిజ్య ప్రధానమైన సినిమాలకి ఆమె కేరాఫ్ ఇప్పుడు. చిరంజీవితో కలిసి ‘భోళాశంకర్’లో నటిస్తోంది. త్వరలోనే ‘గుర్తుందా శీతాకాలం’తో సందడి చేయబోతోంది.
* భారీ విజయాలతో జోరు చూపించిన పూజాహెగ్డే, కీర్తిసురేష్లు ఈమధ్య పరాజయాల్ని చవిచూశారు. ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’... ఇలా కొనసాగింది పూజా పరాజయాల పరంపర. అయినా ఇవేవీ ఆమె కెరీర్పై ప్రభావం చూపలేదంటే పూజాకి ఉన్న క్రేజ్ అర్థమవుతుంది. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు చేస్తున్న ఆమె త్వరలోనే మహేష్బాబుతో కలిసి కొత్త చిత్రం మొదలుపెట్టనుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘జనగణమన’ చేస్తోంది. కీర్తిసురేష్ ‘మహానటి’ తర్వాత మళ్లీ అంతగా ప్రభావం చూపించిన సినిమా చేయలేదు. కథానాయిక ప్రాధాన్యమున్నవి చేసినా పరాజయాలే పలకరించాయి.అయినా సరే, మళ్లీ వాణిజ్య ప్రధానమైన సినిమాల్లో అవకాశాలు ఆమెని వరించాయి. ఇప్పుడు నానితో కలిసి ‘దసరా’లో నటిస్తోంది.చిరంజీవి చిత్రం ‘భోళాశంకర్’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నుంచి కథానాయికలు దిగుమతి అవుతున్నా సీనియర్లు మొదలుకొని, కొత్తతరం వరకు అందరికీ అవకాశాలు దక్కుతుండడం కథానాయికలకి కలిసొస్తున్న మరో అంశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!