K Viswanath: సునిశిత హాస్య స్రష్ట
కళా తపస్వి కె.విశ్వనాథ్ (K Viswanath) చిత్రాలంటే వీనుల విందైన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు.. వీటికి దీటుగా సాహితీ సౌరభాలు సహజసిద్ధంగా ఉంటాయి. అంతే కాదు.. సమపాళ్లలో దట్టించి పప్పులో ఉప్పులా కలిసిపోయిన సునిశిత హాస్యమూ ఉంటుంది.
కళా తపస్వి కె.విశ్వనాథ్ (K Viswanath) చిత్రాలంటే వీనుల విందైన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు.. వీటికి దీటుగా సాహితీ సౌరభాలు సహజసిద్ధంగా ఉంటాయి. అంతే కాదు.. సమపాళ్లలో దట్టించి పప్పులో ఉప్పులా కలిసిపోయిన సునిశిత హాస్యమూ ఉంటుంది. ఈ హాస్యం కథలో భాగంగా ఉంటుందే కానీ, కథకు సంబంధం లేకుండా నేల విడిచి సాము చేయదు.
* విశ్వనాథ్కు దేశ, విదేశాల్లో ఖ్యాతిని ఆర్జించిపెట్టిన ‘శంకరాభరణం’ లాంటి సీరియస్ చిత్రంలోనూ అల్లు పాత్ర ద్వారా నవ్వులు పూయించారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే తన స్నేహితుడైన సంగీత సమ్రాట్టు శంకరశాస్త్రికి సన్మానం చేస్తామని కన్నడ సంఘం సెక్రటరీ వచ్చినపుడు అల్లు చేసే సిఫార్సు, శంకరశాస్త్రి ఉరిమి చూసినపుడల్లా తన భార్య కిలో మూడు రూపాయలతో మార్కెట్ నుంచి తెచ్చిన పుచ్చు వంకాయల ప్రస్తావన తీసుకురావడం ప్రేక్షకుణ్ని గిలిగింతలు పెట్టిస్తుంది. న్యాయవాది అయిన అల్లు వద్దకు ఓ క్లయింటు (నటుడు థమ్) కుటుంబ వివాదంతో రాగా, మాటల మధ్యలో భార్య లోపలి నుంచి పిలవడం అలా మాటిమాటికీ లోనికి వెళ్లి వస్తూ.. ‘ఆ చెప్పు నాయనా! మీ నాన్నకు ఇద్దరు పెళ్లాలా!’ అంటూ ఓమారు, ‘మీ అమ్మకు ఇద్దరు మొగుళ్లా!’ అంటూ మరోమారు.. ‘నీకు ఇద్దరు పెళ్లాలా!’ అంటూ మూడోమారు అల్లు కన్ఫ్యూజనుగా చెప్పేసరికి ఆయనకు ఓ దండం పెట్టి థమ్ విసురుగా వెళ్లిపోతాడు.
* మరో సీరియస్ చిత్రం ‘సప్తపది’లోనూ అల్లు పాత్ర ద్వారానే హాయిగా నవ్వులు పండించారు. గ్రామపెద్ద రాజు గారి పాత్ర పోషించిన అల్లు ఇంటికి ఆరో కుమార్తె పురుడు కోసం వస్తుంది. ఆ సమయంలో అల్లు భార్య సైతం నిండుగర్భంతో ఉంటుంది. తల్లీకూతుళ్లు ఎదురుపడి సిగ్గుపడిపోతూ ‘‘ఎన్నో నెల?’’ అని పరస్పరం కుశల ప్రశ్నలు అడుక్కోవడం, జాగ్రత్తలు చెప్పుకోవడం చూసి నవ్వకుండా ఉండగలమా! ఈ మాట తెలియకుండా వరండాలో కూర్చొన్న అల్లుడితో అసలు విషయం చెప్పలేక అల్లు సతమతం అవుతుంటాడు. ‘మీ అత్తగారిని అమ్మాయితో పురుడుకు పంపడం కుదరదయ్యా! ఎందుకంటే.. అందుకే మరి’ అంటూ అటు తిరుక్కొని ఇటి దూలానికి తాళం వేస్తూ అల్లు చెప్పిన తీరు చక్కిలిగింతలు పెట్టి నవ్విస్తుంది.
* విశ్వనాథ్ తీసిన మరో శిఖర సమాన చిత్రం ‘సాగర సంగమం’లోనూ హాస్యం సమాంతరంగా సాగుతుంది. ‘ఇంటద్దె అడిగితే ఆత్మహత్య చేసుకుంటాం’ అంటూ ఇంటికి నోటీసు అంటించిన సుందోపసుందులు (కమల్హాసన్, శరత్బాబు) ఆ ఇంటి యజమాని థమ్తో బంతాట ఆడుకోవడం భలే సరదాగా ఉంటుంది. పనివాడు శివయ్య పాత్ర పోషించిన పొట్టి ప్రసాద్ను కమల్హాసన్ ‘తీర్థం’ (మద్యం) ఎక్కడ దొరుకుతుందో తెలుసా?’ అని అడిగినపుడు.. ‘‘తెలుసయ్యా! ఒక్క తీర్థం మాత్రమే కాదయ్యా! తీర్థం, పెసరపప్పు ఉదయం శివాలయంలోనయ్యా! తీర్థం, చక్కెర పొంగళి సాయంత్రం వైష్ణవాలయంలోనయ్యా!’ అని చెప్పిన సమాధానం ఫక్కున నవ్విస్తుంది.
జి.ఎస్.జమీర్ హుసేన్
* ఆస్కార్ నామినేషనుకు వెళ్లిన విశ్వనాథ్ చిత్రం ‘స్వాతిముత్యం’లో పిసినారి సుత్తి వీరభద్రరావును ఎంత తిట్టుకుంటామో, అంత నవ్వుకుంటాం. ఇంటికి వచ్చిన తండ్రి (మల్లికార్జునరావు)కి కుమార్తె (అనిత) ఫలహారం పెడుతుంది. ఇది చూసిన సుత్తి వీరభద్రరావు తన ఇంటి మీద పడి తింటున్నాడని మామను తిట్టిపోస్తాడు. అవమానంతో గోదాట్లో దూకి చనిపోతానని తండ్రి బయలుదేరగా.. ‘‘ఉండు నాన్నా! నీతోపాటు నేనూ చచ్చిపోతా’’ అని అనిత బయలుదేరబోతుంది. ఇదంతా చూస్తున్న అల్లుడు ‘‘ఆగు.. ఇదేం ఈతల పోటీ అనుకున్నారటే! ఒకళ్ల వెనకాల మరొకళ్లు దూకి చనిపోవటానికి? మీరెవరూ దూకి చావనక్కర్లేదు. ఇక్కడే బతికి చావండి.. నన్ను చంపండి’’ అంటూ మరోమారు తిట్టిపోస్తాడు.
‘‘చూడు నాయనా! ఇళ్లు కాలిపోయినవాళ్లను నువ్వు చూసి ఉంటావు. ఒళ్లు కాలిపోయినవాళ్లను చూసి ఉంటావు. పతిభక్తితో కాలిపోతున్నవాణ్ని చూశావా.. అది నేనే’’ అంటూ ‘స్వర్ణకమలం’లో సాక్షి రంగారావు పలికే సంభాషణలకు పడి పడి నవ్వుకుంటాం. ఈయన భార్య పాత్ర పోషించిన శ్రీలక్ష్మి సంతానభాగ్యం కోసం 24 గంటలూ అందరు దేవుళ్లను పూజిస్తూ ఆ హారతులు తీసుకువచ్చి భర్త ముఖాన్ని కుంపట్లో కాలిన కుమ్మొంకాయలా చేస్తూ ఉంటుంది. ఇంటి నిండా దేవుళ్ల పటాలే. అన్నీ నిత్య హారతులతో మసిబారి ఉంటాయి.
తకిట తధిమి తకిట తధిమి తందాన..
ఇది హాస్య సన్నివేశం కాదు. సున్నిత భావాలను కళాత్మకంగా చూపే విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు మచ్చుతునక. ‘సాగరసంగమం’లో తప్ప తాగి పెరటి బావిపై బాలు (కమల్హాసన్) నృత్యం చేస్తుంటాడు. అతణ్ని కాపాడేందుకు తప్పనిసరై నుదుట బొట్టు పెట్టుకొని (భర్త చనిపోయి ఉంటాడు) వెళ్లి చేయి పట్టుకొంటుంది మాధవి (జయప్రద). చాన్నాళ్ల తర్వాత ఆమెను అక్కడ చూసిన బాలు నిర్ఘాంతపోతాడు. మాధవిని ఎప్పుడూ సుమంగళిగానే చూడాలని అనుకునే అతడు వర్షానికి కరిగిపోతున్న ఆమె బొట్టుకు తన అరచేయిని అడ్డుపెట్టి లోనికి తీసుకువెళతాడు. ఈ దృశ్యం ఆ చిత్రానికి ఆయువుపట్టు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు