Tollywood: వారసుల తోడుగా.. వినోదాల పండగ
తెరపై ఇద్దరు కథానాయకులు కనిపిస్తున్నారంటేనే.. ఈల చేసి గోల చేయడానికి ప్రేక్షకులంతా థియేటర్ల ముందు బారులు కట్టేస్తారు. అదే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తారలు కలిసి నటిస్తున్నారంటే బాక్సాఫీస్ ముందు కనిపించే సందడి మరోస్థాయిలో ఉంటుంది.
తెరపై ఇద్దరు కథానాయకులు కనిపిస్తున్నారంటేనే.. ఈల చేసి గోల చేయడానికి ప్రేక్షకులంతా థియేటర్ల ముందు బారులు కట్టేస్తారు. అదే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తారలు కలిసి నటిస్తున్నారంటే బాక్సాఫీస్ ముందు కనిపించే సందడి మరోస్థాయిలో ఉంటుంది. ఊర్లో జరగాల్సిన జాతర థియేటర్ల ముందుకొచ్చినట్లే అనిపిస్తుంది. అయితే ఈ తరహా కథలు, కలయికల్ని సిద్ధం చేయడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఇలాంటి ఫ్యామిలీ మల్టీస్టారర్లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నా.. అరుదుగా మాత్రమే ఇందుకు తగ్గ కథలు కుదురుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి అపురూప కలయికల్లో తెలుగులో పలు సినిమాలు సిద్ధమవుతున్నాయి. మరి ఆ చిత్రాలేంటి? వాటి విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..
కథానాయకుడు పవన్ కల్యాణ్.. ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తే చూడాలన్నది మెగా అభిమానుల కోరికే కాదు.. సగటు సినీప్రియుల కోరిక కూడా. ఇప్పుడది ‘వినోదాయ సిథం’ రీమేక్ ద్వారా కార్యరూపంలోకి వచ్చింది. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో పునర్నిర్మిస్తోంది. మాతృకను తెరకెక్కించిన సముద్రఖని ఈ తెలుగు వెర్షన్కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ వినూత్నమైన ఫాంటసీ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్ దేవుడిగా కనిపించనుండగా.. ఆయన భక్తుడిగా సాయితేజ్ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయకుడు నాగార్జున.. ఆయన పెద్ద తనయుడు నాగచైతన్య ‘మనం’, ‘బంగార్రాజు’ సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. కానీ, చిన్న కొడుకు అఖిల్తో నాగ్ ఇంత వరకు కలిసి పని చేయలేదు. అయితే ఇప్పుడీ కలయికలో ఓ సినిమా సిద్ధమవుతోంది. ఇందుకోసం దర్శకుడు మోహన్ రాజా కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని నాగ్, మోహన్ రాజా ఇద్దరూ ధృవీకరించారు. నాగార్జున 100వ సినిమాగా ఇది పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. నాగ్ ప్రస్తుతం ప్రసన్న కుమార్ బెజవాడతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది పూర్తయిన వెంటనే అఖిల్తో చేయనున్న చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. నటుడు మంచు మోహన్బాబు.. ఆయన తనయులు విష్ణు, మనోజ్ ఇప్పటికే పలు చిత్రాల్లో కలిసి సందడి చేశారు. కానీ, మోహన్బాబు తన కూతురు లక్ష్మీ ప్రసన్నతో ఇంత వరకు తెర పంచుకోలేదు. ఇప్పుడా లోటు ‘అగ్ని నక్షత్రం’తో తీరనుంది. వంశీకృష్ణ మళ్ల తెరకెక్కిస్తున్న చిత్రమిది. వినూత్నమైన యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అదే అసలు సవాల్..
సాధారణంగా మల్టీస్టారర్ కథలు సిద్ధం చేయడమంటేనే ఎంతో సవాల్తో కూడిన వ్యవహారం. అలాంటిది ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తారల్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ సిద్ధం చేయడమంటే అది కత్తి మీద సామనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కలయికల్ని ఆయా తారల కుటుంబాలు ఎంత ప్రతిష్ఠాత్మకంగా చూస్తుంటాయో.. ప్రేక్షకులు అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంటారు. ఆయా స్టార్ల ఇమేజ్.. ఆ కుటుంబ అభిమానుల్లో ఉండే అంచనాలు.. మార్కెట్ లెక్కలు.. ఇలా బోలెడన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్స్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఫలితం ఏమాత్రం అటు ఇటైనా ఆ చిత్రం ఆ స్టార్ ఫ్యామిలీకి చేదు జ్ఞాపకంగా మిగలడమే కాక ప్రేక్షకుల్ని తీవ్ర వేదనకు గురిచేస్తుంది.
అందరి కళ్లు ఇటు వైపే..
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రంపై ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. అయితే బాలకృష్ణ తన తనయుణ్ని ‘ఆదిత్య999 మ్యాక్స్’తో తెరకు పరిచయం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని గతంలో ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇందుకోసం తానే ఓ కథ సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ‘ఆదిత్య369’కు సీక్వెల్గా పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది పట్టాలెక్కించనున్నట్లు బాలయ్య పలు సందర్భాల్లో ప్రకటించారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్పై ఇటు నందమూరి అభిమానుల్లోనూ.. అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన కథానాయకులు సూర్య, కార్తి. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలన్నది ప్రేక్షకుల ఎన్నో ఏళ్ల కోరిక. ఇది ‘ఖైదీ2’తో నెరవేరే అవకాశముందని తమిళ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఖైదీ’ తొలి భాగం కథను ‘విక్రమ్’తో ముడిపెట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్.. అందులో సూర్యను రోలెక్స్గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పాత్ర ‘ఖైదీ’ రెండో భాగంలోనూ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘ఖైదీ’ చిత్రంలో కార్తి పదేళ్లు జైలులో ఉండి విడుదలైనట్లు చూపించారు కానీ, తనెందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది చూపించలేదు. అయితే దీనికి రోలెక్స్ పాత్రకు సంబంధం ఉంటుందని.. దీన్ని రాబోయే ‘ఖైదీ2’లో చూపించనున్నారని ప్రచారం వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM