Chiru 154: మెగా అప్‌డేట్‌ వచ్చేసింది.. కొత్త కబురు చెప్పిన నిర్మాణ సంస్థ

మెగా అభిమానులకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తమ బ్యానర్‌పై చిరంజీవి (Chiranjeei), బాబీ (Bobby) కాంబినేషన్‌లో వస్తోన్న సరికొత్త చిత్రానికి...

Updated : 24 Jun 2022 11:51 IST

హైదరాబాద్‌: మెగా అభిమానులకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తమ బ్యానర్‌పై చిరంజీవి (Chiranjeevi), బాబీ (Bobby) కాంబినేషన్‌లో వస్తోన్న కొత్త చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ చెప్పింది. చిరంజీవి 154వ ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ఉదయం ఓ సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో చిరంజీవి చేతిలో లంగరు ఉన్నట్లు కనిపిస్తోంది. ‘‘బాక్సాఫీస్‌ వేటకు లంగరు తయారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా 154 విడుదల కానుంది’’ అని పేర్కొంది.

మాస్‌ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈసినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్‌ (Shruthi Hassan) నటిస్తున్నారు. ఇందులో చిరు ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌(DSP) స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’(Waltair Veerayya) అనే పేరు పెట్టనున్నట్లు ఇటీవల చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ప్రకటించినప్పటికీ తాజాగా విడుదలైన పోస్టర్‌పై ‘టైటిల్‌, టీజర్‌.. త్వరలోనే ప్రకటిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. మరి, ఈ చిత్రానికి చిరు చెప్పిన టైటిలే ఫైనలా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని