Bigg boss telugu 5: శ్రీరామ చంద్ర ఎలిమినేట్‌.. హౌస్‌లో మిగిలింది వారిద్దరే!

బిగ్‌బాస్‌ సీజన్‌-5 నుంచి గాయకుడు శ్రీరామచంద్ర ఎలిమినేట్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ ఫినాలే సందర్భంగా నాగచైతన్య వచ్చి

Updated : 19 Dec 2021 22:01 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5 నుంచి గాయకుడు శ్రీరామచంద్ర ఎలిమినేట్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ ఫినాలే సందర్భంగా నాగచైతన్య వచ్చి ‘ప్రో కబడ్డీ’ ప్రచారం చేశారు. అనంతరం హౌస్‌లోకి వెళ్లి ముగ్గురు కంటెస్టెంట్‌లతో మాట్లాడారు. ఈ సందర్భంగా గోల్డెన్‌ బాక్సులో రూ.20లక్షలు ఆఫర్‌ చేశారు. అయినా శ్రీరామ చంద్ర, షణ్ముఖ్‌, సన్నీ డబ్బులు తీసుకునేందుకు ముందుకు రాలేదు. నాగార్జున మూడు నిమిషాలు అవకాశం ఇచ్చారు. ఇంటి సభ్యుల అభిప్రాయం కూడా తీసుకోమన్నారు. అయినా డబ్బులు తీసుకోలేదు. తర్వాత జరిగిన ఎలిమినేషన్‌ ప్రక్రియలో శ్రీరామ్‌ ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

అనంతరం శ్రీరామ చంద్ర మాట్లాడుతూ.. ‘‘హౌస్‌లో ఉండగా, నాగార్జున ఇచ్చిన మోటివేషన్‌ బాగుంది. ఎవరో ఒక్కరు గెలుస్తారు. ఇక్కడకు వచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అనుకున్నా. కచ్చితంగా దగ్గరయి ఉంటా. బిగ్‌బాస్‌ జర్నీ ఒక పాఠం. రేపటి నుంచి కొత్త శ్రీరామచంద్రను చూసుకుంటా. హౌస్‌మేట్స్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. బిగ్‌బాస్‌ 5 ముందున్న శ్రీరామ చంద్రకూ రేపటి నుంచి మీరు చూసే శ్రీరామ చంద్రకు చాలా తేడా ఉంటుంది. నన్ను సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని