Sridevi Drama Company: శ్రీదేవి డ్రామా కంపెనీకిఏడాది పూర్తి‌.. సెలబ్రేషన్స్‌ అదుర్స్‌

ప్రతి ఆదివారం తెలుగువారికి వినోదాలను పంచుతూ ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company)

Updated : 24 Jan 2022 04:00 IST

హైదరాబాద్‌: ప్రతి ఆదివారం తెలుగువారికి వినోదాలను పంచుతూ ‘ఈటీవీ’లో ప్రసారమవుతున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (Sridevi Drama Company). కేవలం కామెడీతో అలరించడతో పాటు కొత్త ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఈ కార్యక్రమం మొదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రోమోను విడుదల చేశారు. నటుడు జేడీ చక్రవర్తి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ షోలో సుధీర్‌, ఆది, ఆటో రాంప్రసాద్‌ కామెడీ నవ్వులు పంచింది. ‘జోష్‌’ తన మొదటి సినిమా అని, అందులో గోడపై కూర్చొనే బ్యాచ్‌లో ఒకడిగా నటించానని రాంప్రసాద్‌ చెప్పాడు. కార్యక్రమానికి సన్నీలియోన్‌ వస్తోందని చెప్పడంతో సుధీర్‌ చేసిన హంగామా కితకితలు పెట్టిస్తోంది. ఇక మోహన భోగరాజు పాడిన ‘బుల్లెట్‌ బండి’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని