Mahesh babu: మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ మూవీ విడుదల తేదీ ఖరారు

మహేష్‌ బాబు (MaheshBabu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram)

Updated : 18 Aug 2022 17:17 IST

హైదరాబాద్‌: మహేష్‌ బాబు (MaheshBabu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.  ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ సినిమా గురించి చిత్ర బృందం ఆసక్తికర అప్‌డేట్‌ పంచుకుంది. ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’గా వస్తున్న ఈ సినిమాను 2023 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక. ప్రస్తుతం మహేష్‌ తన మేకోవర్‌పై దృష్టిపెట్టారు. ఇందులో ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తారని సమాచారం. హెయిర్‌స్టైల్‌తోపాటు, ఫిజికల్‌గానూ కొత్తగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఇటీవల ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ నేతృత్వంలో కసరత్తులు షురూ చేశారు. ‘అరవింద సమేత’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం ఎన్టీఆర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ దగ్గరే ట్రైన్‌ అయ్యారు. నిర్మాతలు చిత్రీకరణలను నిలిపివేయాలని నిర్ణయించడంతో ఈ కాంబో ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. అన్నీ కుదిరితే, ఈ నెలలోనే చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని