Bollywood: కలిసి రాని చిత్రాలు ప్రేక్షకులు రాని థియేటర్లు
‘‘హిందీ పరిశ్రమ నుంచి స్టార్ కథానాయకుల చిత్రాలు విడుదలైనా అక్కడ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితిని మార్చే సినిమాలు రావాలి.’’
నాలుగు నెలల్లో ఇది బాలీవుడ్ స్థితి
‘‘హిందీ పరిశ్రమ నుంచి స్టార్ కథానాయకుల చిత్రాలు విడుదలైనా అక్కడ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితిని మార్చే సినిమాలు రావాలి.’’
-ఇటీవల ఓ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్.
పై మాటలు అరవింద్ ఊరికే అనలేదు. ఈ ఏడాది ఆరంభం నుంచీ బాలీవుడ్కి కాలం కలిసి రాలేదనే చెప్పాలి. క్యాలెండర్లో నాలుగు నెలలు కరిగిపోయినా.. పరిశ్రమకి దక్కిన విజయాలు వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్నే. కరోనా భయాలతో కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టగా.. అన్ని అవాంతరాలు దాటుకొని థియేటర్ల దాకా వచ్చినవి.. చిన్నా, పెద్దా కలిపి 24. విడుదలైన వాటిలోనూ అత్యధికం ప్రేక్షకుల మనసు గెలుచుకోలేకపోయాయి. కలెక్షన్లు లేక విలవిల్లాడిన హిందీ పరిశ్రమకి మరోవైపు దక్షిణాది సెగ తగిలింది. పరభాషల నుంచి వచ్చిన చిత్రాలు భారీ వసూళ్లు రాబట్టాయి. ఏదేమైనా క్రమంగా పరిస్థితులు సద్దుమణుగుతుండటం, పెద్ద హీరోల షూటింగ్లు జోరుగా సాగుతుండటంతో.. కొన్ని విడుదలకు ముస్తాబవుతుండటంతో భవిష్యత్తులో కలెక్షన్ల సునామీ కళ్లజూస్తామని హిందీ పరిశ్రమ ఆశగా ఎదురుచూస్తోంది.
బాక్స్ఫీసు గెలిచి
ఈ నాలుగు నెలల్లో బాలీవుడ్లో భారీ విజయం అందుకున్న చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. కశ్మీరీ పండిట్ల వెతల్ని హృద్యంగా తెరకెక్కించిన విధానం.. అనుపమ్ఖేర్, మిథున్ చక్రవర్తిలాంటి సీనియర్ల నటన ప్రేక్షకుల హృదయాల్ని కట్టిపడేసింది. రూ.15 కోట్లతో తీసిన ఈ చిన్న సినిమా బాక్సాఫీసు దగ్గర రూ.300 కోట్ల వసూళ్లు కురిపించింది.
* మహారాష్ట్ర మాఫియా క్వీన్ గంగూభాయి హరిజీవన్దాస్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సంజయ్లీలా భన్సాలీ చిత్రం ‘గంగూభాయి కఠియావాడీ’కి ఉత్తరాది జనం బ్రహ్మరథం పట్టారని చెప్పొచ్చు. ఏకంగా రూ.200కోట్ల మార్కు దాటిన ఈ సినిమాలో అలియాభట్ నటనా విశ్వరూపం చూపించిందని అంతా ప్రశంసించారు.
* అజయ్ దేవగణ్ స్వీయనిర్మాణంలో, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో తెరకెక్కించిన ‘రన్వే 34’ ఫర్వాలేదని పించి... మల్టీప్లెక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రేక్షకులను రప్పించలేక...
* మార్చి 18న విడుదలైన ‘బచ్చన్పాండే’ ఆశించిన ఫలితం ఇవ్వలేక పోయింది. అక్షయ్కుమార్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి ప్రముఖలు ఉన్నా... ఆదరణ కనిపించలేదు.
* తెలుగులో ఘనవిజయం సాధించిన ‘జెర్సీ’ని హిందీలో అదే పేరుతో షాహిద్కపూర్, మృణాల్ ఠాకూర్లు జోడీగా రీమేక్ చేశారు. తెలుగువాళ్లలా ఇది హిందీ ప్రేక్షకుల మనసుల్ని కదిలించకలేక సగటు చిత్రంగా నిలిచింది.
* టైగర్ష్రాఫ్ కథానాయకుడిగా వచ్చిన ‘హీరోపంతీ-2’ వాణిజ్యపరంగా బాగా దెబ్బతింది. రొటీన్ కథాకథనాలతో సాగి బాక్స్ఫీసు వద్ద డీలా పడిపోయింది.
* అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఝుండ్’ సందేశాతక చిత్రంగా విమర్శకుల ప్రశంసలందుకుంది. కలెక్షన్లు మాత్రం ఆశించినంత అందుకోలేకపోయింది.
ఆశలన్నీ వీటిపైనే
సరైన విజయాలు లేక ‘ఒక్క హిట్’ అంటూ ఉత్తరాది ఎదురుచూస్తున్న తరుణంలో దక్షిణాది చిత్రాలు హిందీ గడ్డపై జయకేతనం ఎగరేశాయి. ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’లు వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్కు ఇప్పుడు సరైన విజయం కావాలి. ప్రేక్షకులను థియేటర్ వద్దకు తీసుకురాగలిగే సినిమాలు కావాలని డిస్ట్రిబూటర్లు, ఎగ్జిబిటర్లు బలంగా ఆశిస్తున్నారు. నిజానికి ఈ నాలుగు నెలల్లో పెద్ద హీరోలు జనాల ముందుకు రావడానికి సాహసం చేయలేకపోయారు. ముఖ్యంగా ‘ఖాన్ త్రయం’ సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. అదీ.. బాలీవుడ్ ఉసూరుమనడానికి ఓ కారణం కావొచ్చనేది నిపుణుల అభిప్రాయం. క్రమంగా ఈ పరిస్థితి మారుతోంది. మార్చి మొదటివారం నుంచే షూటింగ్లు మూడింతలయ్యాయంటున్నాడు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్. దానికి తగ్గట్టే..రణ్వీర్సింగ్ నటించిన ‘జయేశ్భాయ్ జోర్దార్’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. అక్షయ్కుమార్ ‘పృథ్వీరాజ్’ జూన్ 3న విడుదలకానుంది. ఈయనే చేస్తున్న ‘సర్కస్’.. రణ్బీర్కపూర్, సంజయ్దత్ల ‘షంషేర’, ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’, అమితాబ్ బచ్చన్, రణ్బీర్కపూర్ల ‘బ్రహ్మాస్త్ర’లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు రానున్న నెలల్లో వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఇవి థియేటర్లలోకి వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది బాలీవుడ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకువచ్చింది. -
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు