Lata Mangeshkar: స్వరరాగ గంగా ప్రవాహం.. రూపాయి జీతం కూడా తీసుకోని ఏకైక ఎంపీ!
లతా మంగేష్కర్... ఆమె ఆసలు పేరు ‘హేమ’. హేమ అంటే బంగారం. ఆమె గాత్రమే కాదు...
లతా మంగేష్కర్... ఆమె ఆసలు పేరు ‘హేమ’. హేమ అంటే బంగారం. ఆమె గాత్రమే కాదు... ఆమె వ్యక్తిత్వమూ బంగారమే. ముప్పై ఆరు ప్రాంతీయ, కొన్ని విదేశీ భాషల్లో కలిపి 27వేల చలన చిత్ర గీతాల్లో ఆమె మనకు వినిపిస్తారు. మనసులను తన స్వరంతో వికసింపజేస్తారు. గాయనీగాయకులకు అతి కష్టమైన మూడోశృతిని అలవోకగా ఆలపించగల సామర్థ్యం ఆమెకు లభించిన వరమే కాదు.. ప్రపంచ సంగీత అభిమానుల అదృష్టం. ఆమె రాగాలు మన మనసును ఉత్తేజితం చేస్తే... ఆమె జీవనయానం మన హృదయాల్లో స్ఫూర్తి నింపుతుంది. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచిన లతా జీవన గీతాసారం... మీ కోసం...
లతాజీ పుట్టింది ఇండోర్లో... ఆమె తండ్రి పేరు దీనానాథ్ మంగేష్కర్. ఆయన గాయకుడే గాక, రంగస్థల నటుడు. తల్లి శేవంతీ మంగేష్కర్. తండ్రి రాసిన ‘భవబంధన్’ నాటకంలోని నాయకి పేరు ‘లతిక’. ఆ పాత్రను చూసిన లతాజీ తన పేరును లతా మంగేష్కర్గా మార్చుకున్నారు. తండ్రి నడుపుతున్న నాటకాల కంపెనీలో ప్రదర్శించే సంగీత ప్రధానమైన నాటకాలలో లతా నటించడమే కాక, పాటలూ పాడేవారు. కూతురిలోని గాయనిని మొదట గుర్తించింది ఆమె తండ్రే. 5వ ఏట నుంచే నటించడం మొదలు పెట్టారామె. స్కూల్కి వెళ్లి తోటి విద్యార్థినులకు ఆమె పాటలు నేర్పేవారు. దీన్ని గమనించిన టీచర్ ఆమెను బడికి రావద్దని చెప్పేశారు. అయితే లత బడికి వెళ్లడం మానేశారు. ఈ టీచర్ మందలింపులు వలన కాదని, తన చెల్లెలు ఆశాభోంస్లేను తనతో పాటుగా బడికి రానివ్వకపోవడం వల్లనే అని లతా మంగేష్కర్ ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ముఖాముఖిలో చెప్పడం విశేషం. చెల్లికోసం... పాట కోసం అప్పుడే ‘త్యాగ’రాగం అందుకున్నారామె.
స్ఫూర్తి గీతం
తొలి గురువైన తండ్రి సంగీత సప్తస్వర జ్ఞానం అందిస్తే, ఉద్ధండ హిందుస్థానీ సంగీత గురువులైన అమన్ అలీఖాన్, అమానత్ ఖాన్ల వద్ద శిష్యరికం చేసి ఆమె గానకోకిలగా మారారు. ఆమెకు 13 ఏళ్ల వయసులో అంటే 1942లో ‘కిటి హస్సల్’ అనే మరాఠీ చిత్రం కోసం మొదటిసారిగా రికార్డింగ్ స్టూడియోలో తన తొలి చలన చిత్ర పాటను రికార్డు చేశారు. దురదుష్టవశాత్తూ ఆ చిత్రం విడుదలకి నోచుకోలేదు. ఈ చిత్రంలో ఆమె రెండు పాటలు పాడారు. వీటిలో ‘నాచు యా గాదే’ అనే పాటను చిత్రం నిడివి పెరిగిందని ఎడిట్ చేశారు. రెండో పాట ‘నటాలీ చైత్రాచి నవలాయ్’ మాత్రం లత తొలి మరాఠి పాటగా గ్రామ్ఫోన్ రికార్డుల్లోకి ఎక్కింది. తొలి ప్రయత్నంలో విఫలమైనా, నిరాశపడకూడదనే ‘స్ఫూర్తి’ గీతానికి తనే నిదర్శనంగా నిలిచారు.
గెలుపు స్వరం
1942లో తండ్రి చనిపోగానే కుటుంబ పెద్దగా మీనా, ఆశా, ఉషా మంగేష్కర్ అనే ముగ్గురు చెల్లెళ్ల, తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ పోషణా లతాజీ భుజాలపైన పడ్డాయి. 1948 వరకూ లతాజీ పాటలనే నమ్ముకోకుండా ఎనిమిది చిత్రాలలో నటిగా వేషాలువేసి కుటుంబాన్ని లాక్కొచ్చారు. నూర్జహాన్, షంషాద్ బేగం లాంటి గాయనీగాయకుల కంఠస్వరాలను విన్న సంగీత దర్శకులకి లతాజీ పక్వత చెందని స్వరం పీలగా-కీచుగా అనిపించి ఆమెను మొదట్లో తిరస్కరించారు. 1949లో ‘మహల్’ చిత్రంలో ఆమె పాడిన ‘ఆయేగా ఆనేవాలా’ పాటతో లతా సుడి తిరిగింది. సంగీత దర్శకులంతా ఆమె చుట్టూ తిరగడం మొదలైంది. వద్దన్నే చోటే విజయం సాధించాలని ‘గెలుపు’ స్వరం వినిపించారామె.
ఓదార్పు పాట.
1953లో లతకు తొలి ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. కానీ ఆమె సున్నిత మనస్తత్వం కారణంగా స్టేజి మీదకు వచ్చి దానిని తీసుకోవడానికి తిరస్కరించారు. న్యాయనిర్ణేతలు అందుకు కారణం చెబితే సరిదిద్దుకోగలమని హామీ ఇవ్వడంతో ‘‘వస్త్రాలు లేని ఒక నగ్న స్త్రీ ప్రతిమను ఒక సంప్రదాయ భారత స్త్రీగా అందుకోలేనని’’ ఆమె చెప్పారు. అప్పుడు ఆ అవార్డు ప్రతిమకు ఒక జేబురుమాలును చుట్టి ఇవ్వగా అప్పుడామె దానిని స్వీకరించారు. 1962లో చైనా యుద్ధంలో ఓడిన జవానులను ఓదార్చుతూ లతాజీ పాడిన ‘ఆయె మేరీ వతన్కి లోగొం’ అనే పాటను విని కంట తడి పెట్టానని నెహ్రూ ఆమెతో స్వయంగా చెప్పడం విశేషం.
1942 నుంచి 2015దాకా అంటే అవిశ్రాంతంగా 73 ఏళ్లపాటు స్వర గాన యజ్ఞం చేసిన రికార్డు లత సొంతం. 1990లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమెను వరించింది. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తరువాత భారతరత్న పురస్కారం అందుకొన్న రెండో గాయనీ లతాయే. అందుకే ఆమె జీవితం స్వరరాగ గంగా ప్రవాహం...ఆమె వ్యక్తిత్వం జీవన ఆదర్శ ప్రభాతం.
* లతకి ఇష్టమైన ఆట క్రికెట్.. లార్డ్స్ స్టేడియంలో ఆమెకి ప్రత్యేకమైన, శాశ్వతమైన గ్యాలరీ ఉందని చాలామందికి తెలియదు.
* రాజ్యసభ ఎంపీగా ఉన్నకాలంలో ఒక్క రూపాయి జీతం కూడా తీసుకొని ఏకైక ఎంపీ ఆమె.
* సంగీత దర్శకులు అందరిలో మదన్మోహన్ అంటే ఆమెకి ప్రత్యేకమైన సోదరాభిమానం. అందుకు తగినట్టుగానే ఆయన లతకు గొప్ప ఖ్యాతి తెచ్చిన గీతాలకి స్వరకల్పన చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ