ఎనిమిదేళ్ల  తర్వాత దక్కిన విజయం ‘నాంది’

 అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నాంది’. ఈ సినిమా ఫిబ్రవరి 19న విడులైంది. తాజాగా సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా హీరో నరేష్  భావోద్వేగంగా మాట్లాడుతూ..‘‘నా కెరీర్ లోనే ఈ చిత్రం విజయం సాధించింది. ‘సుడిగాడు’ చిత్రం తరువాత నాకు సరైన విజయం దక్కలేదు.

Published : 19 Feb 2021 21:04 IST

హైదరాబాద్: అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నాంది’. శుక్రవారం (19న) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నరేష్ భావోద్వేగంగా మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ‘సుడిగాడు’ తర్వాత నాకు సరైన విజయం దక్కలేదు. ఒక హాస్య నటుడు వరసగా ఎనిమిది సినిమాలు అపజయం పొందినా.. నా మీద నమ్మకంతో సీరీయస్ నేపథ్యంలో ఓ సినిమా చేద్దామని నిర్మాత సతీష్ నన్ను ప్రొత్సహించారు. ఇక దర్శకుడు విజయ్.. గట్స్‌తో నాతో ఈ పాత్ర చేయించారు. అతడికి ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలని ఉదయం నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. నా తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి గుర్తింపు వచ్చింది. మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌కు ఈ సినిమా నాకు లైఫ్ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించిన వరలక్ష్మికి మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నా. ఈ చిత్రానికి సంగీతం అందించిన శ్రీచరణ్, సినిమాటోగ్రాఫర్ సిద్, కళా దర్శకుడు కడలి బ్రహ్మ అందరూ మనసు పెట్టి చేశారు. వాళ్ల వల్లే ఈ విజయం సాధ్యమైంది. చిత్ర విజయంతో నాకు మాట్లాడ్డానికి మాటలు రావడం లేదు’’ అని నరేశ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని