‘వి’ టాక్‌.. సుధీర్‌బాబు సెలబ్రేషన్స్‌

టాలీవుడ్‌ కథానాయకుడు సుధీర్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. ఆయన, నాని ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న ‘వి’ చిత్రం శనివారం (సెప్టెంబరు 5) ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుధీర్‌బాబు తన కుటుంబ సభ్యులతో.....

Published : 06 Sep 2020 12:17 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు సుధీర్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. ఆయన, నాని ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న ‘వి’ చిత్రం శనివారం (సెప్టెంబరు 5) ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుధీర్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. అదేవిధంగా అమెజాన్‌ ప్రైమ్‌లో దీన్ని చూసిన ప్రేక్షకులు సోషల్‌మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ సినిమాకు మంచి టాక్‌ రావడం చాలా సంతోషంగా ఉందని సుధీర్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకుంటుండగా తీసిన వీడియో, ఫొటోల్ని షేర్‌ చేశారు.

ఇదే సందర్భంగా ఓ అభిమాని ‘వి’ సినిమాలో సుధీర్‌బాబు మాస్‌ సన్నివేశం వచ్చినప్పుడు చేతిలో కర్పూరం వెలిగించి హారతి ఇచ్చారు. ఈ ఫొటో చూసిన సుధీర్‌ అభిమానులకు సూచన ఇచ్చారు. హాని కలిగించే పనులు చేయొద్దని కోరారు. ‘మీ ప్రేమకు ధన్యవాదాలు.. కానీ ఇది సురక్షితమైంది కాదు. మీరు మాస్‌ సన్నివేశం చూసి ఇలా చేశారని అర్థమైంది. కానీ వేడుకలు చేసుకోవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి కదా’ అని పేర్కొన్నారు. ‘వి’ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. సుధీర్‌బాబు సరసన నివేదా థామస్‌, నాని సరసన అదితిరావు హైదరి నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు